Site icon NTV Telugu

భారత్‌ వలే మాకు అవకాశం ఇవ్వండి.. యూకేకు పాకిస్థాన్‌ విజ్ఞప్తి

travel

travel

కరోనా హమ్మారి సమయంలో విదేశీ ప్రయాణికుల రాకపై చాలా దేశాలు నిషేధం విధించాయి.. మా దేశానికి రావొద్దు అంటూ రెడ్‌ లిస్ట్‌లో పెట్టేశాయి… దీంతో… చాలా దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి… అంతే కాదు.. కొన్న విదేశాల వాళ్లు.. ఇతర దేశాల్లోనూ చిక్కుకుపోయిన పరిస్థితి. క్రమంగా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గిపోతుండడంతో.. కొన్ని సడలింపులు, వెసులుబాట్లు కల్పిస్తున్నారు.. భారత్‌లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది.. అయితే, పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడడంతో రెడ్‌లాస్ట్‌ నుంచి తొలగించిన యూకే.. అంబర్ లిస్ట్‌లో చేర్చింది.

ఇక, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు తప్పనిసరి హోటల్‌ క్వారెంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చి.. హోం క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని చెప్పింది. ఇవాళ్టి నుంచి సవరించిన ఆంక్షలు అమలులోకి వచ్చేశాయి.. అయితే, దీనిపై స్పందించిన పాకిస్థాన్.. తమ దేశాన్ని కూడా రెడ్‌లిస్ట్ నుంచి తప్పించాలని యూకేకు విజ్ఞప్తి చేసింది.. రెడ్‌లిస్ట్‌లో పెట్టిన కారణంగా వేలాది మంది ప్రయాణికులు తమ దేశంలో చిక్కుకుపోయారని.. భారత్‌ లాగే తమకూ వెసులుబాటు కల్పించాలని కోరింది.

Exit mobile version