Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..

  • ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్..
  • ఇరాన్‌కు 6 భూమార్గాలను తెరిచిన ఇస్లామాబాద్..
  • అమెరికా దిగ్బంధనం నుంచి తప్పించుకునే ఛాన్స్..
Trump

Trump

Pakistan: ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిర్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే ఒకసారి ఇరు దేశాల బృందాలు సమావేశమయ్యాయి. రెండో దశ సమావేశాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా హార్ముజ్ దిగ్బంధంతో పాటు ఇరాన్ పోర్టుల్ని బ్లాక్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం సాధ్యపడటం లేదు.

Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాత్రం తన జిత్తులమారితనాన్ని చూపిస్తోంది. ఓ వైపు అమెరికా వైపు ఉన్నామంటూనే, ఇరాన్‌కు సహాయం చేస్తోంది. పాకిస్తాన్, రష్యా, చైనా, ఇతర దేశాలతో వాణిజ్యం చేయడానికి ఇరాన్‌కు 6 భూమార్గాలను తెరిచింది. ఇరాన్‌కు పాకిస్తాన్ సరిహద్దు దేశం కావడంతో, పాకిస్తాన్ ద్వారా నేరుగా అరేబియా సముద్రం ద్వారా ఇరాన్ వ్యాపారం చేయడానికి మార్గం సుగమమైంది. ఈ పరిణామాలపై అమెరికా జాతీయ భద్రతా నిపుణుడు డెరెక్ జె గ్రాస్‌మాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వ్యూహాన్ని పాకిస్తాన్ దెబ్బతీస్తోందని అన్నారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి మొదటి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూఏఈ వంటి గల్ఫ్ దేశానికి కూడా పాక్ మధ్యవర్తిత్వం నచ్చడం లేదు. ఇరాన్‌పై పాక్ మెతక వైఖరి అవలంభిస్తున్నారని యూఏఈ మండిపడుతోంది. మధ్యవర్తిత్వంలో పాక్‌కు విశ్వసనీయత లేదని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇరాన్‌కు పాకిస్తాన్ 6 భూ మార్గాలను తెరవడం ట్రంప్ వ్యూహాన్ని దెబ్బతీసింది. ఇరాన్ వెళ్లాల్సిన 3000కు పైగా కార్గో కంటైనర్లు పాకిస్తాన్ ఓడరేవుల్లో క్లియరెన్స్ కోసం వేచి ఉన్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.