Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్లో తీవ్ర నీటి సంక్షోభం..
- పాకిస్తాన్లో తీవ్ర నీటి సంక్షోభం..
- వ్యవసాయానికి కటకట..
- సింధు జలాల ఒప్పందం రద్దుతో పెరిగిన ఇబ్బందులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది.
పాకిస్తాన్ లోని రెండు ముఖ్యమైన ఆనకట్టలు సింధు నదిపై ఉన్న తర్బెలా, జీల్ నదిపై ఉన్న మంగ్లాలో నీరు తగ్గపోతున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన వేడి వాతావరణం నీటి కొరతకు ఒక కారణం కాగా, ఇక చీనాబ్ నది నీటిని భారత్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాకిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూన్ 02, 2025 నాటికి సింధు నదీ వ్యవస్థలో (పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల) నీటి లభ్యత 2024 జూన్ 02తో పోలిస్తే 10.3 శాతం తగ్గింది. నైరుతి రుతుపవనాలు ప్రారంభానికి ఇంకా కనీసం నాలుగు వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చని తెలుస్తోంది.
Also Read
సింధు నదీ వ్యవస్థ అథారిటీ (IRSA) ప్రకారం, జూన్ 2, 2025 నాటికి పంజాబ్ ప్రావిన్స్లో మొత్తం నీటి లభ్యత కేవలం 1,28,800 క్యూసెక్కులు, ఇది గత సంవత్సరం అదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ. ఖరీఫ్ విత్తే కాలం ప్రారంభమైనందున, నైరుతి రుతుపవనాలు జూన్ చివరి నాటికి పంజాబ్ ప్రావిన్స్ చేరుకునే అవకాశం లేకపోవడంతో నీటి కొరత ఆ దేశ రైతులకు పెద్ద విపత్తగా మారొచ్చు.
Read Also: Mount Etna: భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..!
గత నెలలో పాకిస్తాన్ ఈ వేసవిలో 21 శాతం నీటి కొరత ఉంటుందని అంచనా వేసింది. దీంతో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అక్కడి అధికారులు సూచించారు. పాకిస్తాన్ పంజాబ్, సింధ్ ప్రావిన్సులకు కీలకమైన రెండు ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష నిల్వలో 50 శాతం నీటి కొరత ఉంటుందని ఇస్లామాబాద్ కూడా అంచనా వేసింది. గత వారం తజకిస్తాన్ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించదు’’ అని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపితేనే నీటిని విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందంపై భారత్దే తుది నిర్ణయం కాబట్టి పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం పశ్చిమ నదులను (సింధు, జీలం, చీనాబ్) పాకిస్తాన్కు మరియు తూర్పు నదులను (రవి, బియాస్, సట్లెజ్) భారతదేశానికి కేటాయిస్తుంది. అదే సమయంలో ఇరు దేశాలు నీటి మట్టాలు, ప్రాజెక్టుల వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే, ప్రస్తుతం భారత్ ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్తో ఎలాంటి డేటా పంచుకోవడం లేదు. భారత్ నీటి మట్టాల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోతే, పాకిస్తాన్కి కరువు, వరద పరిస్థితులపై అవగాహన ఉండదు. ఫలితంగా వర్షాకాలంలో వరదలు సంభవిస్తే పాక్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!