Italy: పెళ్లికి నిరాకరించిందని కూతురిని చంపిన పాక్ దంపతులు.. జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లికి నిరాకరించిందని కూతురిని హత్య చేసిన పాకిస్తాన్ దంపతులకు మంగళవారం ఇటలీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించడంతో సొంత కూతురినే చంపిన ఈ ఘటన 2021లో ఇటలీలో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పాక్ దంపతులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మృతురాలి తల్లి మాత్రం ఇప్పటికి పరారీలో ఉంది. వివరాలు.. పాకిస్తాన్ చెందని 18 ఏళ్ల సమన్ అబ్బాస్ ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని నోవెల్లారాలో నివసిస్తోంది. 2020లో ఆమెకు మేనబావతో తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేసి నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే మరో అబ్బాయిని ప్రేమించిన ఆమె పెళ్లికి నిరాకరించింది.
Also Read: VC Sajjanar: మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకం.. త్వరలో 2050 కొత్త బస్సులు
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
అయినా తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుండటంతో యువతి ఇటలీలోని సోషల్ వర్కర్స్ను సంఘాన్ని ఆశ్రయించడంతో 2020లో వారు ఆమెను ఆశ్రమమంలో ఉంచారు. అయితే ప్రియుడితో కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె పాస్పోర్ట్ కోసం 2021లో తన ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు తన బంధువలతో కలిసి ఆమెను చంపేందుకు కుట్ర చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న ఆమె సీక్రెట్గా వెంబడించిన తల్లిదండ్రులు, మేనమామ మరో ముగ్గురు బంధువులు కలిసి ఆమెను హత్య చేసి ఓ పాడుబడ్డ ఇంట్లో ఉంచారు. అనంతరం యువతి తల్లిదండ్రులు పాకిస్తాన్ వెళ్లిపోయారు.
Also Read: PM Modi: ఖలిస్తానీ పన్నూ హత్య కుట్రపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ..
ఆమె కనిపించకపోవడంతో బాయ్ఫ్రెండ్ తల్లిదండ్రులను అనుమానిస్తూ పోలీసు కేసు నమోదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా అప్పటికే వారు పాకిస్తాన్ వెళ్లినట్టు తెలిసింది. ఇంటి చూట్టూ పక్కల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా 2021 ఏప్రిల్ 30న ఆమెను మరణాయుధాలతో కుటుంబ సభ్యులు ఆమె వెంబడించినట్టు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు పాకిస్తాన్ వెళ్లిన వారు కనిపించలేదు. చివరికి ఈ ఏడాది ఆగస్టులో వారిని ఇటలీ రప్పించిన పోలీసులు స్పెయిన్లో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తామే హత్య చేసినట్టు యువతి తండ్రి, బంధువులు అంగీకరించారు. దీంతో ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన ఇటలీ కోర్టు యువతి మేనమామకు 14 నెలల జైలు శిక్ష విధించింది. ఇక ఆమె తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. కానీ యువతి తల్లి నాజియా షాహీన్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!