Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Assembly Adjourned For Half An Hour

TS Assembly: ప్రభుత్వ నోట్‌పై ప్రిపేర్‌కు టైమ్‌ కావాలన్న విపక్షాలు.. అరగంట టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌

Published Date :December 20, 2023 , 11:57 am
By Bhanu
TS Assembly: ప్రభుత్వ నోట్‌పై ప్రిపేర్‌కు టైమ్‌ కావాలన్న విపక్షాలు.. అరగంట టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

TS Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల చేసింది. 42 పేజీల పుస్తకాన్ని సభ్యులకు అందించి చర్చను ప్రారంభించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనం సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 42 పేజీల పుస్తకం ఇస్తే రెండు నిమిషాల్లో చర్చ ప్రారంభిస్తే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ముందురోజే నోట్ ఇచ్చి ఉంటే ఏం చెప్పాలో ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేదన్నారు. నోట్ చదవడానికి కనీసం ఒక గంట టీ విరామం ఇవ్వాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. నోట్ సిద్ధం చేసేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సభ్యులు ఇచ్చిన నోట్‌పై ప్రిపేర్‌ చేసేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో స్పీకర్ టీ విరామం ప్రకటించి సభను అరగంట పాటు వాయిదా వేశారు.

భట్టి, శ్రీధర్ బాబు మాటలు..

ఇక నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే సభ అరగంటపాటు వాయిదా వేశారు. కాగా.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం గడ్డం ప్రశాద్ మాట్లాడుతూ.. ఎవరు ఎవరికి కించపరిచినట్లు మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో అందరూ ఒకరినినొకరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని కోరారు. సభను మరింత హుందాగా నడపాలని కోరారు. మూడో శాసన సభ లో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు. ముందుగా ఇక డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు.. అన్ని వనరులను అనుకున్న దిశగా నడిపించలేదన్నారు. రోజు వారి ఖర్చులు కూడా లేకుండా చేశారు. ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఆర్థిక ఆరాచకత్వం జరిగిందన్నారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పాలన్నారు. మార్పు కోరుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. వారికి కూడా ఆర్థిక పరిస్థితి తెలియ చేయాలని మేము శ్వేతపత్రం విడుదల చేస్తున్న అన్నారు. ఇక ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గతంలో కూడా డిస్కషన్ మొదలు ఐనప్పుడే మాకు నోట్ ఇచ్చారని తెలిపారు. మేము కూడా ఇదే విషయం అక్కడ ఉన్నప్పుడు చెప్పామన్నారు. హరీష్ సూచన పరిగణలోకి తీసుకుంటామన్నారు. సభలో పెట్టగానే చర్చ అంటే ఎలా? అని హరీష్ రావు ప్రశ్నించారు. సభ్యుల హక్కులు కాపాడాలి మీరు అన్నారు. ప్రొటెస్ట్ చేసే హక్కు సభ్యులకు ఇవ్వాలని కోరారు. మా హక్కులు కాపాడండి అన్నారు. ఇక మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 42 పేజీలు ఇచ్చారు.. ఇది చదువుకోవాలంటే టీ బ్రేక్ అయినా ఇవ్వండని కోరారు. ప్రిపేర్ కాకుండా ఇంత ప్రాధాన్యత అంశంపై చర్చ చేయలేమన్నారు. టీ బ్రేక్ కనీనం 40 నిమిషాలు ఇస్తే మేము చదువుకుని ప్రశ్నించే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం శాసనసభలో అరగంట పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి.
H-1B Visa: అమెరికా గుడ్‌న్యూస్‌.. హెచ్- 1బీ వీసాల పునరుద్ధరణ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly Telangana
  • telangana assembly
  • Telangana Assembly 2023
  • Telangana assembly adjourned for half an hour
  • TS Assembly Election Results

తాజావార్తలు

  • S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!

  • ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

  • Telangana Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Megastar Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డు స్వీకరించడంపై చిరు ఎమోషనల్ ట్వీట్…

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions