North Korea: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. కిమ్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన వింత ప్రకటనలతో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్లే వచ్చినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాతో అనుసంధానమైన సరిహద్దు నుంచి గ్రహాంతరవాసులు ఈ వైరస్ను బెలూన్లో నింపి విసిరారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలిపారు.
ఏప్రిల్లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి గ్రహాంతరవాసుల లాంటి వస్తువును తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట. అయితే పొరుగు దేశం దక్షిణ కొరియా మాత్రం గ్రహాంతరవాసుల నుంచి వ్యాపిస్తుందని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కిమ్ జోంగ్ వాదనను నమ్మడం కష్టమని సియోల్లోని ఒక ప్రొఫెసర్ తెలిపారు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Taliban: అఫ్గాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.. విదేశీయులకు తాలిబన్ల హెచ్చరిక
సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు కిమ్ సర్కారు కొన్ని సూచనలను జారీ చేసింది. సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు గాలిలో అంటే బెలూన్లు, గ్రహాంతరవాసుల వంటి వాటి గురించి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎవరైనా అలాంటివి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడినట్లు పేర్కొన్న తర్వాత, ఏప్రిల్ చివరి నుంచి ఉత్తర కొరియాలో సుమారు రెండు మిలియన్ల మంది ప్రజలు వింత జ్వరంతో బాధపడుతున్నారు. మే 12 న, ఉత్తర కొరియా మొదటిసారిగా తమ దేశంలో కరోనావైరస్ కేసులు వచ్చినట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ దేశం మొత్తం లాక్డౌన్ను విధించారు. ఈ మేరకు ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది.
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..