Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- ఫుట్బాల్ మైదానంలో కాల్పులు
- 29 మంది మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైజీరియాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫుట్బాల్ మైదానంలో టెర్రరిస్టులు తుఫాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు.

Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని అడమావా రాష్ట్రం గుయాకు గ్రామంలోని ఫుట్బాల్ మైదానంలో ప్రజలు గుమిగూడి ఉండగా ఉగ్రవాదులు ఆకస్మాత్తుగా దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. ఇళ్లను, ప్రార్థనా మందిరాలను, మోటార్ సైకిళ్లను తగలబెట్టారు. కొన్ని గంటల పాటు ఈ బీభత్సం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. దాడి వెనుక ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు.
రాష్ట్ర గవర్నర్ అహ్మదు ఉమారు ఫింటిరి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ దాడిని ‘‘మానవత్వానికి అవమానం’’గా అభివర్ణించారు. ప్రజల భద్రత కోసం వెంటనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కామెరూన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి ఉగ్రవాద సంస్థలు హింసకు పాల్పడుతున్నాయి. 2009లో ప్రారంభమైన బోకో హరామ్ తిరుగుబాటుతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంక్షోభం నైజర్, చాద్, కామెరూన్ దేశాలకు కూడా వ్యాపించింది.
ఈ దాడిపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో పెరుగుతున్న భద్రతా సమస్యలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం