Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
- జీతాల చెల్లింపుపై నేపాల్ సర్కార్ కీలక నిర్ణయం
- ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం
- ప్రభుత్వ నిర్ణయానికి ఆర్థిక శాఖ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారు? నెల రోజులు పని చేశాక ఇస్తారు? ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నేపాల్లో పద్దతులు మారిపోయాయి. శాలరీ విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇకపై నెలవారీ ప్రకారం కాకుండా ప్రతి 15 రోజులకోసారి రెండు దఫాలుగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి ఆర్థిక శాఖ కూడా పచ్చజెండా ఊపేసింది.
ఖర్చులను ఉత్తేజపరిచి.. దాని ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని మార్చినట్లుగా తెలిపింది. ఇకపై 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
ఆర్థిక వ్యవస్థను బలపరచడమే ముఖ్య ఉద్దేశమని అధికారులు కూడా చెబుతున్నారు. ఉద్యోగులకు సకాలంలో నగదు అందితే నెల ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరి.. ఆపై తగ్గిపోకుండా నెల మొత్తం స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నెలాఖరులో ఖర్చుల విషయంలో తరచుగా ఇబ్బంది పడే మధ్యతరగతి ఉద్యోగులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు కూడా స్వాగతించారు. పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు, రోజువారీ గృహ ఖర్చులను ఈ విధానం ద్వారా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ప్రతి రెండు వారాలకు క్రమం తప్పకుండా నిధులు అందడం వల్ల స్వల్పకాలిక రుణాలపై ఆధారపడటం కూడా తగ్గుతుందని అంటున్నారు.
ఈ మార్పు చిన్న వ్యాపారాలకు, చిల్లర వ్యాపారులకు కూడా ప్రయోజనం చేకూర్చగలదని ఆర్థికవేత్తలు అంటున్నారు. నెల ప్రారంభంలో ఖర్చులో ఆకస్మిక పెరుగుదల.. ఆ తర్వాత మందగమనం ఉండటానికి బదులుగా సమతుల్యంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ నమూనా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే అమలవుతోంది. ఇది విజయవంతమైతే ఇతర ఆర్థిక వ్యవస్థలకు ఇది ఒక నమూనాగా ఉపయోగపడగలదని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!