Artemis-1: ఆర్టెమిస్-1 ప్రయోగానికి సిద్ధమైన నాసా.. అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1… ముచ్చటగా మూడోసారి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇంధన ట్యాంకులో సమస్యల కారణంగా రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది. లోపాలను సరిదిద్దిన నాసా సాంకేతిక నిపుణులు ఈ నెల 17న ట్యాకింగ్ టెస్ట్కు దానిని రెడీ చేశారు. అయితే ఆగస్టు 29న తొలిసారి దీనిని నింగిలోకి పంపేందుకు సిద్ధం చేశారు. చివరి క్షణంలో ఇంధన ట్యాంకులో సమస్యల కారణంగా… ప్రయోగాన్ని వాయిదా వేశారు. అనంతరం లోపాన్ని సరిదిద్ది ఈ నెల 3న మరోమారు ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. అయితే, ఈసారి కూడా అదే సమస్యతో వాయిదా పడింది. ఈసారి ఇంధన ట్యాంకును అణువణువునా గాలించిన నిపుణులు… సీల్స్ను రీప్లేస్ చేసి లీకేజీలను అరికట్టి ప్రయోగానికి సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న అది చంద్రుడిపై దూసుకెళ్లనుంది.. మరోవైపు.. అక్టోబర్లోనే ప్రయోగం సాధ్యం కాదనే వాదనలు కూడా ఉన్నాయి..
Read Also: Jacqueline Fernandez: ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ బ్యూటీకి నోటీసులు.. ఈ సారైనా..?
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
కాగా, నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆర్టెమిస్-1 పేరుతో ఈ యాత్ర చేపట్టింది. అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనుంది… అయితే, ఇందులో వ్యోమగాములు ఉండరు. తర్వాతి దశలో మాత్రం నలుగురు వ్యోమగాములను పంపించేలా ప్లాన్ చేశారు.. 6 వారాలపాటు సాగే ఈ యాత్రలో చంద్రుడిని చేరుకునేందుకు కోన్ ఆకారంలో ఉండే ఓరియన్ స్పేస్క్రాఫ్ కు వారం రోజులు పడుతుందని… మొదట ఇది చంద్రుడి ఉపరితలానికి పైన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరుకుంటుందని.. ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుందని.. ఆ దశలోనే భూమికి 4.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. అంటే ఈ దశలో ఓరియన్లో కనుక వ్యోమగాములు ఉంటే భూమి, చంద్రుడిని ఒకేసారి చూసే అవకాశం లభించనుంది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!