ప్రతిష్టాత్మకమైన తానా బోర్డుకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా బోర్డ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జూనీ ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
IND Playing XI vs WI: నేడే ఐదవ టీ20.. స్టార్ ప్లేయర్పై వేటు! భారత తుది జట్టు ఇదే
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పటిల్లో పీడియాట్రిక్ కార్డియో వాస్క్యూలర్ అనస్థీషియాలజీలో డాక్టర్ శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. అలాగే బేలోర్ కాలేజీ అఫ్ మెడిసిన్లో వైద్య విద్యని బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శిగా, ప్రతిష్టాకరమైన తానా – బసవతారకం ప్రాజెక్ట్కి ముందుండి మార్గదర్శకాలతో పాటు కోటి రూపాయల నిధిని సమకూర్చి.. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వైద్య పరికరాల కొనుగోలుకు తానా ఫౌండేషన్ తరుపున అందించటంలో ముఖ్య భూమిక ఫోషించారు. సనాతన హిందూ ధార్మిక కార్యక్రమాలు అయిన వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాల, దేవాలయాల అభివృద్ధికి ఆర్ధిక వనరులు సమకూర్చటంతో పాటు విశేష సేవలందిస్తున్నారు.
Gudivada Amarnath: కేంద్రంతో కాకపోతే పుతిన్తో చెప్పుకో.. పవన్కి మంత్రి అమర్నాథ్ సవాల్
బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్మి దేవినేని.. గతంలో తానా బోర్డు కోశాధికారిగా, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్గా, విమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గానే కాకుండా ఇటీవలే జరిగిన 23వ తానా మహా సభలలో పలు కమిటీలలో ఆమె సేవలందించారు. బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గతంలో 21వ తానా మహాసభల కార్యదర్శి గా , కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్ గానే కాకుండా కాన్సర్ అవగాహన, నిధుల సమీకరణం కోసం ప్రపంచంలో ఎత్తైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించారు. అలాగే ఈ మధ్య జరిగిన 23వ తానా మహాసభలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కోటి రూపాయల నిధిని సమకూర్చడంలో ప్రత్యేక పాత్ర ఫోషించారు.
Prabhas: ఫ్లాప్ సినిమాతో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతున్నాడు
తానా బోర్డు చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, తానా ఫౌండేషన్ని సమన్వయ పరుచుకుంటూ, సరైన దిశలో మార్గ నిర్దేశం చేస్తూ.. తానా సేవలను, ప్రతిష్టని సమర్ధవంతంగా మరింత ముందుకు తీసుకువెళ్తామని.. అలాగే బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా తానాని తెలుగువారికి మరింత చేరువ చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
