Pakistan: భారత్ బంగ్లాదేశ్పై దాడి చేస్తే.. మిసైల్స్తో దాడి చేస్తామని పాక్ లీడర్ వార్నింగ్..
- భారత్ బంగ్లాదేశ్పై దాడి చేస్తే తీవ్ర ప్రతిస్పందన..
- పాకిస్తాన్ అధికార పార్టీ నేత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, భారత్పై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఇటీవల, రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, బంగ్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్పై భారత్ దాడి చేస్తే సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ పాలక ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఒక వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. ఢాకాపై న్యూఢిల్లీ ఏదైనా చర్య తీసుకుంటే, పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ సార్వభౌమత్వంపై భారత్ దాడి చేస్తే, ఎవరైనా బంగ్లాదేశ్ వైపు చెడు దృష్టి పెట్టడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ప్రజలు, పాక్ సైన్యం, పాక్ క్షిపణులు చాలా దూరంలో లేవని గుర్తుంచుకోండి అంటూ భారత్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో భారత్ చేస్తున్న కుట్రల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఉస్మాని పేర్కొన్నారు. అఖండ భారత్ భావజాలాన్ని బంగ్లాదేశ్పై రుద్దే ప్రయత్నాన్ని పాక్ ప్రతిఘటిస్తుందని ఆయన అన్నారు.
షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, మహ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తిగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. అక్కడి కొందరు విద్యార్థి నాయకులు భారత్ను విడగొడతామని, ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల, హాది మరణం తర్వాత ఢాకాలోని భారత ఎంబసీపై రాడికల్ మూక దాడికి యత్నించింది. ఇక యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!