Jaish-e-Mohammed: హిందూ మహిళలను ఎదుర్కొనేందుకు “మహిళ ఉగ్రవాద విభాగం”.. జైషే మహ్మద్ బ్రెయిన్ వాష్..
- హిందూ మహిళలకు వ్యతిరేకంగా మహిళా టెర్రరిస్టులు..
- జైషే మహ్మద్ దుష్ట పన్నాగం..
- భారత్ టార్గెట్గా ఉగ్రవాదంలోకి మహిళా రిక్రూట్మెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది. భారత్ టార్గెట్గా కొత్త తరహా దాడులకు పాకిస్తాన్, దాని ఉగ్రసంస్థలు ప్లాన్ చేస్తున్నాయి.
సిందూర్ తర్వాత దెబ్బతిన్న జైషే మళ్లీ బలపడటానికి ప్రయత్నిస్తోంది. జమాత్ ఉల్ మోమినాత్ అనే మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసింది. బహవల్పూర్లోని ‘‘మర్కాజ్ ఉస్మాన్ ఓ అలీ’’లో మసూద్ అజార్ చేసిన ప్రసంగంలో భారత్ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అతని దుష్ట ప్రణాళికలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదంలో చేరి స్త్రీ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది అని చెప్పాడు.
Also Read
- China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
Read Also: Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
‘‘భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటుంది. మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది. కాబట్టి మనం మన మహిళల్ని సిద్ధం చేయాలి’’ అని ఉగ్రసంస్థ విషబీజాలు నాటుతోంది. పాకిస్తాన్లోని ప్రతీ జిల్లాలో జమాల్ ఉల్ మోమినాత్ శాఖలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ దానికి నియామక బాధ్యత కలిగిన జిల్లా ముంతాజియా అనే మహిళా రిక్రూట్మెంట్లు నిర్వహిస్తుందని జైష్ చెబుతోంది. ప్రధానంగా ఉగ్రవాదుల భార్యలు, పేద మహిళలు, చనిపోయిన ఉగ్రవాదుల బంధువులే లక్ష్యంగా రిక్రూట్మెంట్ కోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జమాల్ ఉల్ మోమినాత్ కోసం ఆన్లైన్ జిహాద్ కోర్సులను ప్రారంభించారు. ఈ క్లాసులకు మసూద్ అజార్ సోదరి ఉమ్మే మసూద్(సమైరా) ట్రైనర్గా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!