Jaish-e-Mohammed: హిందూ మహిళలను ఎదుర్కొనేందుకు “మహిళ ఉగ్రవాద విభాగం”.. జైషే మహ్మద్ బ్రెయిన్ వాష్..
- హిందూ మహిళలకు వ్యతిరేకంగా మహిళా టెర్రరిస్టులు..
- జైషే మహ్మద్ దుష్ట పన్నాగం..
- భారత్ టార్గెట్గా ఉగ్రవాదంలోకి మహిళా రిక్రూట్మెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది. భారత్ టార్గెట్గా కొత్త తరహా దాడులకు పాకిస్తాన్, దాని ఉగ్రసంస్థలు ప్లాన్ చేస్తున్నాయి.
సిందూర్ తర్వాత దెబ్బతిన్న జైషే మళ్లీ బలపడటానికి ప్రయత్నిస్తోంది. జమాత్ ఉల్ మోమినాత్ అనే మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసింది. బహవల్పూర్లోని ‘‘మర్కాజ్ ఉస్మాన్ ఓ అలీ’’లో మసూద్ అజార్ చేసిన ప్రసంగంలో భారత్ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అతని దుష్ట ప్రణాళికలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదంలో చేరి స్త్రీ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది అని చెప్పాడు.
Also Read
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
Read Also: Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
‘‘భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటుంది. మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది. కాబట్టి మనం మన మహిళల్ని సిద్ధం చేయాలి’’ అని ఉగ్రసంస్థ విషబీజాలు నాటుతోంది. పాకిస్తాన్లోని ప్రతీ జిల్లాలో జమాల్ ఉల్ మోమినాత్ శాఖలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ దానికి నియామక బాధ్యత కలిగిన జిల్లా ముంతాజియా అనే మహిళా రిక్రూట్మెంట్లు నిర్వహిస్తుందని జైష్ చెబుతోంది. ప్రధానంగా ఉగ్రవాదుల భార్యలు, పేద మహిళలు, చనిపోయిన ఉగ్రవాదుల బంధువులే లక్ష్యంగా రిక్రూట్మెంట్ కోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జమాల్ ఉల్ మోమినాత్ కోసం ఆన్లైన్ జిహాద్ కోర్సులను ప్రారంభించారు. ఈ క్లాసులకు మసూద్ అజార్ సోదరి ఉమ్మే మసూద్(సమైరా) ట్రైనర్గా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!