Maldives: మాది చిన్న దేశం, భారత్తో శత్రుత్వం పెంచుకోం..మాల్దీవుల అధ్యక్షుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులకు మహ్మద్ ముయిజ్జు ప్రెసిడెంట్ కాబోతున్నారు. భారత వ్యతిరేక హమీలతో ఆయన అక్కడి ప్రజల నుంచి ఓట్లు సంపాదించారు. ఇందులో ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హమీ ఇచ్చారు. గతంలో ప్రెసిడెంట్గా ఉన్న ఇబ్రహీం సోలీహ్ భారత అనుకూలంగా వ్యవహరించారు.
ఇదిలా ఉంటే తమది చిన్న దేశమని, ఎవరితో శత్రుత్వం పెట్టుకోమని, భౌగోళిక రాజకీయ శత్రుత్వంలో చిక్కుకోమని అన్నారు. మాల్దీవుల విదేశాంగ విధానాన్ని ఇందులో నిమగ్నం చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. మాల్దీవులు భారత్, చైనాతో కలిసి పనిచేయబోతోందని ఆయన తెలిపారు. ఏఎఫ్పీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖలు చేశారు.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Read Also: Shehla Rashid: “కాశ్మీర్ గాజా కాదు”.. ప్రధాని మోదీపై జేఎన్యూ మాజీ స్టూడెంట్ లీడర్ ప్రశంసలు..
శుక్రవారం ముయిజ్జూ మాల్దీవులకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మేము భారత్, చైనాతో పాటు అన్ని దేశాలతో కలిసి పనిచేయబోతున్నామని తెలిపారు. అక్టోబర్ నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ దేశంలో భారత సైనికుల ఉనికిని తొలగించేందుకు భారత్ తో చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు.
మాల్దీవుల్లో దాదాపుగా 70 మంది భారత సైనికులు, ఇండియా స్పాన్సర్ చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో పెట్రోలింగ్కి సహాయపడుతున్నాయి. అయితే తాము చైనా సైనికులను కూడా అనుమతించేది లేదని ముయిజ్జు స్పష్టం చేశారు.
- Tags
- china
- india
- Maldives
- Mohamed Muizzu
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!