Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్ దుర్మరణం
- టర్కీలో ఘోర విమాన ప్రమాదం
- లిబియా ఆర్మీ చీఫ్ అలీ మృతి
- ఆర్మీ చీఫ్తో పాటు 8 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ అలీ కన్నుమూశారు. లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ మరణవార్తపై ప్రధాన మంత్రి అబ్దుల్హమీద్ ద్బీబా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా బాధ కలిగిందని ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొంది. లిబియాకు గొప్ప నష్టంగా అభివర్ణించారు. ఆర్మీ చీఫ్తో పాటు నలుగురు అధికారులు చనిపోయినట్లు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: Off The Record: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఆ సీనియర్ నేతకు ఇష్టం లేదా?
Also Read
లిబియా సైనికాధికారి, మరో నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ జెట్ విమానం మంగళవారం టర్కీ రాజధాని అంకారా నుంయి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విమానంలోని సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని లిబియా అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉందని టర్కిష్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ మంత్రి పార్టీ ఎలా పొతే నాకేంటి అనుకుంటున్నారా?
ఈ ప్రమాదంలో మరణించిన మరో నలుగురు అధికారులు… లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్-ఫితౌరి గ్రైబిల్, మిలిటరీ తయారీ అథారిటీకి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్-ఖతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సలహాదారు మొహమ్మద్ అల్-అసవి డియాబ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయంలో మిలిటరీ ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ ఒమర్ అహ్మద్ మహజౌబ్ ఉన్నారు.
అంకారాకు దక్షిణంగా 70 కిలోమీటర్లు (సుమారు 43.5 మైళ్ళు) దూరంలో ఉన్న హేమానా జిల్లాలోని కేసిక్కావాక్ గ్రామం సమీపంలో ఫాల్కన్ 50 రకం బిజినెస్ జెట్ శిథిలాలు కనుగొనబడినట్లు టర్కిష్ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం అంకారాలోని ఎసెన్బోగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత లిబియాకు తిరిగి వెళ్తున్న క్రమంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయని టర్కీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెల్లడించారు. రాత్రి 8:30 గంటలకు విమానం టేకాఫ్ అయి 40 నిమిషాల తర్వాత సంబంధాలు తెగిపోయాయని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. అన్ని కమ్యూనికేషన్లు ఆగిపోయే ముందు విమానం హేమానా సమీపంలో అత్యవసర ల్యాండింగ్ సిగ్నల్ జారీ చేసిందని యెర్లికాయ చెప్పారు.
అత్యవసర ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్నప్పుడు విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని టర్కిష్ అధ్యక్ష కమ్యూనికేషన్స్ కార్యాలయ అధిపతి బుర్హానెట్టిన్ డ్యూరాన్ పేర్కొన్నారు. విమానం విద్యుత్ లోపం గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు తెలియజేసి అత్యవసర ల్యాండింగ్ను అభ్యర్థించిందని చెప్పారు. విమానాన్ని ఎసెన్బోగాకు తిరిగి మళ్లించారు. ఇంతలోనే ఎమర్జెనీ ల్యాండింగ్కు సన్నాహాలు జరిగిపోయాయన్నారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి నలుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు టర్కీ న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. టర్కిష్ అధికారులతో కలిసి పనిచేయడానికి లిబియా కూడా ఒక బృందాన్ని అంకారాకు పంపుతుంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!