Israel-Gaza Conflict: గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్.. రెండో రోజు వైమానిక దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Gaza Conflict: ఇజ్రాయిల్ దాడులతో విరుకుకుపడుతోంది. గాజా స్ట్రిప్ లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది. రెండో రోజు కూడా ఇజ్రాయిల్ తన దాడులను పెంచింది. గాజాను నియంత్రిస్తున్న ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ వరసగా దాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడుల్లో ఒక చిన్నారితో పాటు తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో నలుగురు ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులను ఇజ్రాయిల్ హతమార్చింది. సుమారుగా 79 మంది గాయపడ్డారు. గత ఏడాది కాలంగా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఉన్న శాంతి వాతావరణం మరోసారి దెబ్బతింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా పాలస్తీనా నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్లతో దాడి చేసింది. దీంతో రెండో రోజు కూడా ఇజ్రాయిల్ తమ దాడులను పెంచింది. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్లలో కొన్ని రాజధాని టెల్ అవీవ్ వైపు దూసుకువచ్చాయి. అయితే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ పాలస్తీనా రాకెట్ దాడులను తిప్పికొట్టింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 19 మంది ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులను పట్టుకున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. శుక్రవారం ఇజ్రాయిల్ పైకి పాలస్తీనా దాదాపుగా 160 రాకెట్ల ను ప్రయోగించినట్లు ఇజ్రాయిలీ ఢిపెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడులపై జోక్యం చేసుకోవాలని.. తమ ప్రజలకు రక్షణ కల్పించాలని పాలస్తీనా పౌర వ్యవహారాల మంత్రి హుస్సెన్ అల్ షేక్ ట్విట్టర్ లో కోరారు.
Also Read
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
Read Also: Rakesh Tikait: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
ఇజ్రాయిల్ ఆర్మీ వెస్ట్ బ్యాంకులో ఇస్లామిక్ జిహాద్ కమాండర్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్రిక్తత పెరిగింది. దీంతో సదరు ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ కు వార్నింగ్ ఇచ్చింది. ఆ తరువాత నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంక్షోభానికి ముగింపు పలికేలా.. ఈజిప్టు, ఐరాస, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని.. అయితే ఆ చర్చల్లో ఇంకా పురోగతి లేదని పాలస్తీనా అధికారులు తెలిపారు. 2021మేలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి సంక్షోభం ఏర్పడింది. ఆ సయమంలో ఇరుదేశాలు భీకరపోరు సాగించాయి. ఈ సమయంలో గాజాలో 250 మంది మరణించగా.. ఇజ్రాయిల్ లో 13 మంది మరణించారు. ఆ తరువాత నుంచి సరిహద్దు వెంబడి శాంతి నెలకొన్నా.. ప్రస్తుతం మళ్లీ ఇరు దేశాల మధ్య దాడులు ప్రారంభం అయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!