Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- ఇజ్రాయెల్ దూకుడు చర్య
- గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- నిలిచిన వాటర్ ఫ్లాంట్ ఉత్పత్తులు
- ఆకలితో పాటు నీళ్ల కొరతతో గాజా వాసుల ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Divya Bharathi : కన్యా రాశి కలువ..’ దివ్య భారతి’ వయ్యారాలు బరవా
Also Read
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు కొద్దిమంది మాత్రమే విడుదలయ్యారు. దీంతో తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో గాజాకు వెళ్లే సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో నిత్యావసరాల ట్రక్కులన్నీ కూడా సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్ మరో చర్యకు దిగింది. ఇజ్రాయెల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేసింది. దీంతో గాజాలో అంధకారంతో పాటు.. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ఆకలితో పాటు నీళ్ల కొరత కూడా ఏర్పడింది. పరిస్థితులు మరింత ధీన స్థితికి దిగజారిపోయాయి.
ఇది కూడా చదవండి: Group1 Results: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
అయితే ఈ చర్యను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందాన్ని చేసుకోవాలని హమాస్ తెలిపింది. ఇందుకోసం వెంటనే చర్చలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మొదటి దశ ఒప్పందాన్నే ఏప్రిల్ వరకు కొనసాగించాలంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీంతో ఇరువర్గాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. గాజాను ధ్వంసం చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా.. హమాస్కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేదంటే నరకం చూస్తారని హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా గాజాను ఖాళీ చేయాలని.. అభివవృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒకేసారి బందీలు విడుదల కోసం హమాస్పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది. దీనికి హమాస్, అంతర్జాతీయ మధ్యవర్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Abhinaya : పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ నటి
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!