Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- ఇజ్రాయెల్ దూకుడు చర్య
- గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
- నిలిచిన వాటర్ ఫ్లాంట్ ఉత్పత్తులు
- ఆకలితో పాటు నీళ్ల కొరతతో గాజా వాసుల ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Divya Bharathi : కన్యా రాశి కలువ..’ దివ్య భారతి’ వయ్యారాలు బరవా
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ఇటీవల హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసింది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు కొద్దిమంది మాత్రమే విడుదలయ్యారు. దీంతో తొలి విడత ఒప్పందాన్ని కొనసాగించాలని.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో గాజాకు వెళ్లే సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో నిత్యావసరాల ట్రక్కులన్నీ కూడా సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్ మరో చర్యకు దిగింది. ఇజ్రాయెల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేసింది. దీంతో గాజాలో అంధకారంతో పాటు.. నీటిని శుద్ధి చేసే ప్లాంట్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ఆకలితో పాటు నీళ్ల కొరత కూడా ఏర్పడింది. పరిస్థితులు మరింత ధీన స్థితికి దిగజారిపోయాయి.
ఇది కూడా చదవండి: Group1 Results: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
అయితే ఈ చర్యను హమాస్ ఖండించింది. ఇజ్రాయెల్ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించింది. రెండో దశ ఒప్పందాన్ని చేసుకోవాలని హమాస్ తెలిపింది. ఇందుకోసం వెంటనే చర్చలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. అయితే మొదటి దశ ఒప్పందాన్నే ఏప్రిల్ వరకు కొనసాగించాలంటూ ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. దీంతో ఇరువర్గాల చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. గాజాను ధ్వంసం చేసింది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా.. హమాస్కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేదంటే నరకం చూస్తారని హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా గాజాను ఖాళీ చేయాలని.. అభివవృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను అరబ్ దేశాలు ఖండించాయి. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇవే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఒకేసారి బందీలు విడుదల కోసం హమాస్పై అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచుతోంది. దీనికి హమాస్, అంతర్జాతీయ మధ్యవర్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Abhinaya : పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ నటి
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!