ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- వెలుగులోకి ఐసిస్ దురాగతాలు..
- మహిళల్ని హింసించేందుకు ‘‘హ్యాండ్ బుక్’’..
- యజీదీ మహిళలపై అకృత్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై లిఖితపూర్వక నియమాలను రూపొందించింది. ఆస్ట్రేలియా కోర్టులో ‘‘ఐసిస్ వధువు’’గా పిలువబడే మహిళ విచారణ సందర్భంగా ఈ ఉగ్రసంస్థ క్రూరత్వానికి సంబంధించిన పత్రాలను, హ్యాండ్ బుక్ వెలుగులోకి వచ్చాయి.
మహిళల్ని హింసించడానికి హ్యాండ్ బుక్:
ఖైదీలు, బానిసలకు సంబంధించి ప్రశ్నలు, సమాధానాలు కలిగిన ఒక పుస్తకాన్ని ఐసిస్ పరిశోధన, ఫత్వా విభాగం రూపొందించిందని కోర్టుకు తెలిపారు. మహిళల్ని బానిసలుగా మార్చడం, వారిని కొనడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, ఇతర వ్యక్తులతో మార్పిడి చేసుకోవడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి వాటిని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మహిళా ఖైదీలను శిక్షించడం, వారితో వ్యవహరించే పద్ధతులను ఈ బుక్లో ప్రస్తావించారు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
యజీదీ మహిళలపై అకృత్యాలు:
ముఖ్యంగా యజీది మహిళల్ని బంధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బానిసలుగా చేయగాన్ని సమర్థించే ప్రయత్నాలు ఈ పత్రాలు, బుక్లో ఉన్నాయి. 2014లో ఆగస్టులో ఇరాక్లోని సింజర్ ప్రాంతంపై ఐసిస్ దాడులు చేసి, యజీదీ ప్రజలపై అకృత్యాలకు పాల్పడినట్లు కోర్టుకు తెలిపారు. ఈ దాడిలో వేల మరణించారు. సుమారు 6800 మంది యజీదీ మహిళలు, పిల్లల్ని ఐసిస్ బందీలుగా పట్టుకుందని అంచనా. వీరిలో చాలా మంది ఆచూకీ నేటికి తెలియలేదు. అధికారులు కోర్టుకు చెప్పిన దాని ప్రకారం.. పిల్లల్ని వివిధ మిలీషియాల మధ్య కొని అమ్మాలు. చాలా మందిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించారు. వీరిపై పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు.
యజీదీ బాలికపై అరాచకాలు:
ఈ కేసు విచారణ సమయంలో యజీదీ బాలికపై జరిగిన వేధింపుల గురించి ప్రస్తావనకు వచ్చింది. 15 ఏళ్ల బాలికను ఐసిస్ ఉగ్రవాదులు ఆమె కుటుంబంపై దాడి చేసి, ఆమె తల్లి, సోదరుల్ని చంపి ఆమెను బందీగా పట్టుకున్నారు. బాలికను పలువురు పురుషుల మధ్య అమ్మారు. పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు. చిత్ర హింసలకు గురిచేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ఆమెను ఆ తర్వాత ఒక కుటుంబం 10,000 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ బాలికను ఇంటి పనులు చేయడానికి బంధించారని, పదే పదే అత్యాచారాలకు గురైందని, ఆమెకు స్వేచ్చగా తిరిగే అవకాశం ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. యజీదీ మహిళల్ని కేవలం లైంగిక బానిసలుగా మాత్రమే చూసినట్లు కోర్టుకు వివరించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!