Ireland: ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ యువకుల దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Kerala youths died in Ireland: ఐర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటిలో ముగిని చనిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలురు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం వీరిద్దరు మరికొంత మంది స్నేహితులతో కలసి ఉత్తర ఐర్లాండ్ లో ఉన్న సరస్సుకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. చనిపోయిన వారిని జోసెఫ్ సెబాస్టియన్, రేవెన్ సైమన్ లు గా గుర్తించారు. వీరితో పాటు మరో 6 మంది సరదాగా ఈతకు వెళ్లారు. ఈ ఘటన విషాదకరమని స్థానిక మీడియా నివేదించింది.
Read Also: Fraud That They Will Give Jobs: మూడు రోజులుగా గుడిలో బంధిగా యువకుడు? బాబు మాయలోడే..!
Also Read
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్ను దించిన చైనా!
- Iran War: ట్రంప్ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్పై దాడి చేసిందా?
నార్తర్న్ ఐర్లాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటిలో బాలురు మునిగిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వెంటనే రెస్క్యూ సిబ్బంది, పారామెడికల్, ఐదుగురు అత్యవసర సిబ్బందిని ప్రమాద ప్రాంతానికి పంపారని తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు. ప్రమాదం నుంచి ముందుగా ఒక బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు..అక్కడ అతను చనిపోయాడు. రెస్క్యూ, పోలీస్ డైవర్ల సహాయంతో మరో బాలుడిని నీటి నుంచి బయటకు తీశారు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మూడో బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఇతడితో పాటు మరో ముగ్గురిని కూడా ప్రమాదం నుంచి రక్షించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన షాక్కు గురిచేసినట్లు నార్తర్న్ పోలీస్ వెల్లడించింది.
బాలురంతా ఇటీవల స్థానిక ప్రాథమిక, గ్రామర్ పాఠశాలకు చెందిన వారు. ఇటీవలే వారి జీసీఎస్సీ ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఘటనపై డెర్రీ-లండండరీ మేయర్, స్ట్రాజెన్ డిస్ట్రిక్ కౌన్సిలర్ సాండ్రా డఫీ విచారం వ్యక్తం చేశారు. ఐరిష్ రాజకీయ నాయకుడు ఓనీల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!