Site icon NTV Telugu

Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

Uss Abraham Lincoln

Uss Abraham Lincoln

Israel-Iran War: ఇరాన్ తన దాడుల తీవ్రతను పెంచింది. ఇజ్రాయిల్-యూఎస్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ లోని యూఎస్ మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలు ఉన్న యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’’ ప్రారంభించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయిల్‌పై వరసగా బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగిస్తోంది.

Read Also: Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

తాజాగా, అరేబియా సముద్రంలో మోహరించిని అమెరికాకు చెందిన అణుశక్తి ఆధారిత యుద్ధ నౌక ‘‘USS అబ్రహం లింకన్ (USS Abraham Lincoln)’’పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ మీడియా ప్రకారం.. ఈ యుద్ధనౌకపై 4 క్షిపణులతో దాడి జరిగినట్లు చెప్పింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఈ దాడి జరిగినట్లు చెప్పింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను వదిలిపెట్టేది లేదని ఇరాన్ హెచ్చరించింది. అయితే, అమెరికా రక్షణ శాఖ ఈ దాడిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇదే నిజమైతే యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Exit mobile version