NTV Telugu Site icon

USA: అమెరికాలో తాత, మామలను కాల్చిచంపిన భారతీయ విద్యార్థి..

Usa

Usa

USA: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ అనే వ్యక్తి తాత, అమ్మమ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), బింధు బ్రహ్మభట్(72), యష్ కుమార్ బ్రహ్మభట్(38)లను కాల్చి చంపాడని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ విభాగం, మిడిల్ సెకస్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్ ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఇంటిలో నుంచి కాల్పులు శబ్ధం విన్నట్టు ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు చేరుకునే సరికి ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఓం బ్రహ్మభట్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ ఆయుధాలు కలిగి ఉన్న కేసులను నమోదు చేశారు. గుజరాత్‌కి చెందిన ఓం, బాధితులతో కలిసి ఉంటున్నాడు. ఓం తల్లిదండ్రులు దిలీప్ కుమార్ బ్రహ్మభట్ ఒత్తిడి మేరకు అతడిని అమెరికాకు పంపించినట్లు బంధువులు తెలిపారు.

Read Also: KBC: కేబీసీలో కోటి గెలిచిన 12 ఏళ్ళ కుర్రాడు.. కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే?

ఓం గత రెండు నెలల క్రితమే న్యూజెర్సీ వెళ్లాడని, కాండోలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఓం తుపాకీతో నేరం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం కోర్టుకు హాజరైన సమయంలో ప్రశాంతంగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేసింది ఎవరని ప్రశ్నించిన సమయంలో..ఓం ‘‘ అది నేనే కావచ్చు’’ అని సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దిలీప్‌కుమార్, బిందు నిద్రిస్తున్న సమయంలో తలపై కాల్చినట్లు ఓం పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి యషుకుమార్ తలపై పలుచోట్ల కాల్పులు జరిపాడని విచారణలో తేలింది. అయితే అసలు అతను ఎందుకు ఈ హత్యలు చేశాడనే విషయంపై స్పష్టత రాలేదు.