China: భారత్- పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా
- భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత..
- ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరిన చైనా..
- సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నమని బీజింగ్ స్పష్టం చేసింది.
Read Also: Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
ఇక, భారత్-పాక్ మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై డ్రాగన్ కంట్రీ నిన్న కూడా (శుక్రవారం) స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ తాము వ్యతిరేకిస్తామన్నారు.
Read Also: Fact Check: S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై పాక్ ఫేక్ న్యూస్ ప్రచారం.. అసలు నిజం ఇదే!
కాగా, భారత్–పాకిస్తాన్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి ఆ తర్వాత భారత సైన్యం ప్రతి దాడి చేసిందని పరోక్షంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!