China: భారత్- పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా
- భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత..
- ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరిన చైనా..
- సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నమని బీజింగ్ స్పష్టం చేసింది.
Read Also: Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !
Also Read
ఇక, భారత్-పాక్ మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై డ్రాగన్ కంట్రీ నిన్న కూడా (శుక్రవారం) స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ తాము వ్యతిరేకిస్తామన్నారు.
Read Also: Fact Check: S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై పాక్ ఫేక్ న్యూస్ ప్రచారం.. అసలు నిజం ఇదే!
కాగా, భారత్–పాకిస్తాన్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి ఆ తర్వాత భారత సైన్యం ప్రతి దాడి చేసిందని పరోక్షంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!