Lottery: ఈ జంట తెలివికి సలామ్ కొట్టాల్సిందే.. “గణిత విద్య”తో రూ.200 కోట్ల లాటరీని గెలిచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lottery: అమెరికాలో ఓ వృద్ధ జంట అసలైన జీనియస్లని చెప్పొచ్చు. ఏకంగా 26 మిలియన్ డాలర్లు( రూ. 200 కోట్లు)లను లాటరీల్లో సంపాదించింది. ఇతంతా వారి అదృష్టం అంటే మీరు పప్పులో కాలేసిటనట్లే, వీరికి ఉన్న అపారమైన గణిత విద్యను, మ్యాథ్స్ ట్రిక్స్ ఉపయోగించి ఈ లాటరీలను సొంతం చేసుకున్నారు. మిషిగాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలోని జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వీరు రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ప్రస్తుతం 80, 81 ఏళ్లు. వీరి జీవిత కథ ఆధారంగా ‘జెర్రీ & మార్జ్ గో లార్జ్.’ అనే సినిమా కూడా వస్తోంది.
ఈ క్రమంలో ఓ రోజు 2003లో సెల్బీ విన్ఫాల్ అనే లాటరీ గేమ్ని చూశారు. అయితే దీన్ని చూడగానే దీంట్లో ఒక మ్యాథమెటికల్ లూప్హోల్ ఉన్నట్లు గమనించాడు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఇందులో డబ్బు సంపాదించవచ్చని అతను కనుగొన్నారు. ఈ జాక్ పాట్ సొమ్ము 5 మిలియన్లకు చేరుకోని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుందని గమనించారు. ఈ లెక్క ప్రకారం 1,100 డాలర్లు వెచ్చించి, కొన్ని సంఖ్యలు ఉన్న 1,100 టికెట్లను కొనుగోలు చేస్తే కనీసం 1900 డాలర్లు పొందవచ్చని గ్రహించారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
Read Also: Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
ఆ తర్వాత తొలుత 3600 డాలర్ల పెట్టి టికెట్లను కొనుగోలు చేస్తే వీరు 6300 డాలర్లను సంపాదించారు. ఆ తర్వాత 8000 డాలర్లతో టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సారి లాభం రెట్టింపైంది. దీంతో వీరిద్దరు కలిసి జీఎస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి స్నేహితులు, బంధువులను ఇందులో చేర్చుకున్నారు. మసాచుసెట్స్లో విన్ఫాల్ వంటి లాటరీ కొనుగోలు చేస్తే, అక్కడికి వెళ్లి మొత్తం లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు.
గత 9 ఏళ్లలో ఈ టీం మొత్తం 26 మిలియన్ డాలర్లను సంపాదించారు. ఇందులో 8 మిలియన్ డాలర్లను పన్నుల రూపంలో కట్టారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో వీరి ఆరుగురు పిల్లలకు, వారి 14 మంది మనవలు-మనవరాళ్లను, 10 మంది ముని మనవలను చదివించారు. అయితే వీరిపై విచారణ జరిగినా.. పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే కొనుగోలు చేయడంతో వీరిని అక్కడి అధికారులు ఏం చేయలేదు. కేవలం రెండు నిమిషాల్లోనే ఈ ఆటలోని లొసుగులను గమనించి, పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లు వీరు వెల్లడించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!