Dam Blast: కఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. వరద నీటిలో ఖేర్సన్ నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dam Blast: యుద్ధం అంటే ప్రజలు ఎంతో భయపడతారు. యుద్ధం వస్తే ఆయా దేశాల్లోని ప్రజలకు తీవ్ర కష్టాలు ఉంటాయి. సాధారణంగా యుద్ధంలో ఫిరంగులు.. క్షిపణులు.. తూటాలు.. తుపాకులను ఉపయోగిస్తారు. ఇపుడు కొత్తగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దానికి నీటితో నిండి ఉన్న డ్యామ్ను పేల్చి ఆ నీటిని దేశంలోకి పంపించి వరదల్లో ప్రజల్లో చిక్కుకునేలా చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కఖోవ్కా డ్యామ్ ను పేల్చారు. దీంతో డ్యామ్కు దిగువన ఉన్న ఖేర్సన్ నగరం వరద నీటిలో మునిగిపోయింది. అయితే కఖోవ్కా డ్యామ్ను పేల్చింది ఎవరనేది తేల లేదు. నువ్వే పేల్చావని రష్యా అంటుంటే.. లేదు నువ్వే పేల్చావని ఉక్రెయిన్ రష్యా మీద ఆరోపణలు చేస్తోంది.
Read also: Manipur violence: మణిపూర్లో కూంబింగ్ ఆపరేషన్.. భారీగా ఆయుధాలు, బాంబులు స్వాధీనం
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్లను వదలడం లేదు..
రష్యా బలగాలు ఉక్రెయిన్లోకి వెళ్లాలంటే నీపర్ నదిపై ఉన్న ఈ డ్యాం కీలకం. ఈ డ్యామ్ను దాటే రష్యా సైన్యం ఉక్రెయిన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రష్యా సైన్యం తమ దేశంలోకి రాకుండా ఉండటం కోసం ఉక్రెయిన్ డ్యామ్ను పేల్చివేసిందని రష్యా ఆరోపిస్తుండగా.. రష్యానే డ్యామ్ను పేల్చివేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. మొత్తానికి రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేయడంతో ఉక్రెయిన్లోని దిగువ ప్రాంతాలు వరద మయమయ్యాయి. సుమారు 60 వేల మంది వరద ముంపులో ఉన్నట్లు తేలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఉక్రెయిన్ సైన్యం సహాయక చర్యలు అందిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read also: Fish Food Festival: నేడే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. ముస్తాబైన సరూర్నగర్ స్టేడియం
ప్రస్తుతం ఖేర్సన్ నగరం తూర్పు ప్రాంతం రష్యా అధీనంలో ఉండగా.. పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. యుద్ధం ప్రారంభంలోనే రష్యా ఖేర్సన్ నగరం తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది. రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో సహాయక చర్యలు సక్రమంగా అందించడం లేదని ఉక్రెయిన్ దేశాధ్యక్షులు జెలెన్స్కీ విమర్శించారు. ఆనకట్ట కూల్చివేతను రష్యా అధికారులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. డ్యామ్ పేల్చివేత వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూఎన్ చీఫ్ హెచ్చరించారు. సోవియేట్ కాలం నాటి నోవా కఖోవ్కా డ్యామ్ను హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్గా వాడుతున్నారు. రష్యా ఆక్రమణదారులు కావాలనే హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ను పేల్చివేశారని.. ఇది మానవ హనన పర్యావరణ బాంబుగా వీడియో సందేశంలో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డ్యామ్ను కూల్చినంత మాత్రాన తమను ఎవరూ ఆపలేరని అన్నారు.
- Tags
- Army
- City
- Kakhovka dam
- war
- Water
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?