Donald Trump 2.0: అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన ప్రకటన
- అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన ప్రకటన
- బోర్డర్లో ఎమర్జెన్సీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘‘దక్షిణ సరిహద్దుల్లో మరిన్ని బలగాలను మోహరిస్తాం.. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తాం.. విదేశీ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం’’ అంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.
‘‘వెంటనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నా మంత్రివర్గం పని చేస్తుంది. ధరలను తగ్గిస్తాం.. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ఫాక్చరింగ్ దేశంగా అమెరికా అవతరిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అమెరికా.. ఆటో మొబైల్ రంగాన్ని అనూహ్యరీతిలో ముందుకు తీసుకెళ్తాం. పౌరులు తమకు నచ్చిన మోడల్ వాహనాన్ని కొనుక్కునేలా చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా ఉత్పత్తి చేస్తాం. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తాం.. రాజకీయ కక్ష సాధింపులకు ఆస్కారం ఇవ్వం‘‘ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
‘‘ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం.. ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేస్తాం. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం. ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందే ఇజ్రాయెల్ బందీలు ఇంటికి చేరుకున్నారు. గాజా బందీలు ఇంటికి చేరుకోవడం సంతోషం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం.’’ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
‘‘అమెరికా ఫస్ట్ అనేది మా నినాదం.. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు.. అమెరికా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయి. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. విద్య, ప్రజావైద్యం మరింత మెరుగుపరచాల్సి ఉంది. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికా ప్రజలకు నేడు స్వాతంత్రత్య దినం. దేశ సరిహద్దుల రక్షణ మనకు ముఖ్యం.. శాంతిభద్రతల విషయంలో మరింత కఠినతరంగా ఉండాలి. అమెరికా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలి.. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి తృటిలో బయటపడ్డా. 2025 మనకు స్వేచ్ఛాయుత ఇయర్.’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
- Tags
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!