Donald Trump 2.0: అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన ప్రకటన
- అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన ప్రకటన
- బోర్డర్లో ఎమర్జెన్సీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగంలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ‘‘దక్షిణ సరిహద్దుల్లో మరిన్ని బలగాలను మోహరిస్తాం.. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తాం.. విదేశీ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతాం’’ అంటూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.
‘‘వెంటనే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నా మంత్రివర్గం పని చేస్తుంది. ధరలను తగ్గిస్తాం.. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ఫాక్చరింగ్ దేశంగా అమెరికా అవతరిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అమెరికా.. ఆటో మొబైల్ రంగాన్ని అనూహ్యరీతిలో ముందుకు తీసుకెళ్తాం. పౌరులు తమకు నచ్చిన మోడల్ వాహనాన్ని కొనుక్కునేలా చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా ఉత్పత్తి చేస్తాం. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తాం.. రాజకీయ కక్ష సాధింపులకు ఆస్కారం ఇవ్వం‘‘ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
‘‘ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం.. ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేస్తాం. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం. ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు ముందే ఇజ్రాయెల్ బందీలు ఇంటికి చేరుకున్నారు. గాజా బందీలు ఇంటికి చేరుకోవడం సంతోషం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం.’’ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
‘‘అమెరికా ఫస్ట్ అనేది మా నినాదం.. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు.. అమెరికా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయి. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. విద్య, ప్రజావైద్యం మరింత మెరుగుపరచాల్సి ఉంది. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికా ప్రజలకు నేడు స్వాతంత్రత్య దినం. దేశ సరిహద్దుల రక్షణ మనకు ముఖ్యం.. శాంతిభద్రతల విషయంలో మరింత కఠినతరంగా ఉండాలి. అమెరికా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలి.. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి తృటిలో బయటపడ్డా. 2025 మనకు స్వేచ్ఛాయుత ఇయర్.’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
- Tags
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!