Pakistan Army Helicopter: బలూచిస్థాన్లో కూలిన పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్.. 6గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Army Helicopter: పాకిస్తాన్లో వాయువ్య ప్రావిన్స్లోని బలూచిస్థాన్లో సోమవారం రాత్రి అదృశ్యమైన పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్.. లాస్బెలా జిల్లాలోని మూసా గోత్ సమీపంలో కుప్పకూలినట్లు పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం మంగళవారం తెలిపింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీతో సహా విమానంలో ఉన్న ఆరుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు.మూసా గోత్, విందార్, లాస్బెలాలో వరద సహాయక చర్యలలో ఉండగా జరిగిన ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీ) వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీతో సహా మొత్తం 6 మంది అధికారులు మరణించారని తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం సంభవించిందని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. పాక్ ఆర్మీ జవాన్ల మృతి పట్ల దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. వరద బాధితులకు సాయమందిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విచారం వ్యక్తం చేశారు.
Russia on Pelosi Taiwan Visit : “పూర్తిగా రెచ్చగొట్టే చర్య”.. చైనాకు వంతపాడుతున్న రష్యా!
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
బలూచిస్థాన్లోని లాస్బెలాలో వరద సహాయక చర్యల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ అదృశ్యమైనట్లు నిన్న రాత్రి పాకిస్థాన్ సైన్యం ధ్రువీకరించింది. బలూచిస్థాన్లో జరుగుతున్న వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న XII కార్ప్స్ కమాండర్ జనరల్ సర్ఫరాజ్ అలీ, ఇతర ఐదుగురు సీనియర్ సైనిక అధికారులు హెలికాప్టర్లో ఉన్నారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. బలూచిస్థాన్లోని లాస్బెలాలో వరద సహాయక చర్యలలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయిందని వెల్లడించింది. బలూచిస్తాన్లో వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న 12 కార్ప్స్ కమాండర్తో సహా ఆరుగురు వ్యక్తులు విమానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..