Afghanistan: మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్..! తప్పుపట్టిన క్రికెటర్లు
- ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ రాజ్యం కఠిన నిర్ణయాలు
- మహిళలకు వైద్య విద్యను నిషేధించిన తాలిబాన్
- తప్పుపట్టిన క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం తాలిబాన్ రాజ్యం నడుస్తోంది. తాలిబాన్ పాలనలో శిక్షలు ఘోరంగా ఉంటాయి. అందుకే ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తాజాగా మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. నర్సింగ్, మిడ్వైఫరీ కోర్సులతో సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని తాలిబాన్ ఆదేశించింది.

Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
తాలిబాన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెటర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు వైద్య విద్యను నిషేధించడం హృదయ విదారకమైనదని…తీవ్ర అన్యాయం అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ నబీ పేర్కొన్నాడు. అమ్మాయిలకు నేర్చుకునే అవకాశాన్ని.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణం అన్నారు. వారి కలలకు, దేశ భవిష్యత్కు ద్రోహం చేయడమే అన్నారు. తాలిబాన్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని రషీద్ ఖాన్ కోరారు. ప్రతి ఒక్కరికీ విద్యపై హక్కు ఉందని ఇస్లాం బోధిస్తుందని గుర్తుచేశారు. బాలికల విద్యాహక్కును పునరుద్ధరించాలని కోరారు.
ఇస్లామిక్ బోధనలో విద్య ప్రధాన స్థానాన్ని కలిగి ఉందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఇది పురుషులకు, మహిళలకు ఇద్దరికి జ్ఞాన సాధనే అని తెలిపారు. తాలిబాన్ నిర్ణయం.. భవిష్యత్ను మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇస్లామిక్ చట్టానికి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల విద్యపై కత్తి పడింది. నర్సింగ్ మరియు మిడ్వైఫరీ కోర్సులలో చేరే మహిళలపై కొత్త నిషేధాన్ని విధించాలని తాలిబాన్ యోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఆయా సంస్థల్లో అమలులోకి రావడానికి ముందు తుది పరీక్షలను నిర్వహించడానికి 10 రోజుల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. తాలిబాన్ నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ కూడా ఖండించింది.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!