India And Japan: ఇండో-పసిఫిక్లో యథాతథ స్థితే కొనసాగింపు: జపాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India And Japan: ఇండియా, జపాన్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు. రెండు దేశాలు పరస్పర మిత్ర దేశాలని.. అన్ని రకాలుగా భాగస్వామ్య దేశాలుగా కొసాగుతాయని ప్రకటించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు విడదీయలేని భాగస్వామి అని జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయషి పేర్కొన్నారు. ఇండియాతో సంబంధాలను భవిష్యత్తులో మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన.. శుక్రవారం ‘ఇండియా-జపాన్ ఫోరమ్’ సదస్సులో పాల్గొన్నారు. జీ-20 కూటమికి భారత నాయకత్వం విజయవంతమయ్యే దిశగా కలిసి పనిచేయడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. ఇండో-పసిఫిక్లో యథాతథ స్థితిని మార్చేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్గా అభివర్ణించే పేద దేశాల సమస్యలను తీర్చకపోతే అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలనే పిలుపు కేవలం నినాదంగానే ఉండిపోతుందని హయషి అన్నారు.
Also Read
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
జపాన్ తమకు సహజ మిత్రదేశమని సదస్సులో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. క్వాడ్ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ఆ కూటమి పనైపోయిందని ప్రతి ఆర్నెల్లకోసారి కొందరు చెబుతుంటారని.. కానీ అంతలోనే అది రెట్టింపు శక్తితో వస్తుంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు, ఆధునికీకరణపై సదస్సులో జైశంకర్, హయషి చర్చించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, పలు ఇతర సందర్భాల్లో తమ మంత్రిత్వ శాఖ అందించిన సేవలపై పార్లమెంటులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్న మంత్రి.. ఆ వివరాలతో శుక్రవారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్. ఆ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ‘దేశ పురోగతి కంటే పక్షపాత రాజకీయాలే విపక్షాలకు ముఖ్యం కావడం విచారకరం. ఉభయ సభల్లో నేను ప్రకటన చేయకుండా అవి అడ్డగిస్తున్నాయి. విదేశాల్లో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులు, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రవాసులు, వివిధ దేశాల్లోని వృత్తి నిపుణులకు వీసాలు వంటి అనేక అంశాల్లో మోదీ సర్కారు తగిన రీతిలో స్పందిస్తోంది. వీటన్నింటినీ తగిన రీతిలో చర్చించేందుకు అవకాశం లభించకపోవడం దురదృష్టకరం’ అని మంత్రి వీడియోలో తెలిపారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..