China: చైనాకు కొత్త కష్టం.. తగ్గుతున్న ‘‘కిండర్ గార్టెన్స్’’..
- చైనాను కలవరపెడుతున్న జనాభా సంక్షోభం..
- వరసగా రెండేళ్లుగా తగ్గిన జననాల రేటు..
- పెరుగుతున్న వృద్ధ జనాభా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి యువత వివాహాలు చేసుకోవడానికి, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. వరసగా రెండో ఏడాది కూడా ఆ దేశంలో శిశు జననాలు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశం పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రసవం, శిశు సంరక్షణ సేవల్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు అక్కడి జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘చైల్డ్ బర్త్-ఫ్రెండ్లీ సొసైటీ’’ని సృష్టించడానికి కొత్త చర్యల్ని ప్రారంభించింది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న సందర్భంలో ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
Read Also: Akkineni Nageswara Rao Last Message: ANR చివరి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
ఈ చర్యలు శిశుజననం మరియు శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, విద్య, గృహం మరియు ఉపాధిలో మద్దతును విస్తరించడం మరియు వివాహం మరియు పిల్లలను కనడం చుట్టూ ‘‘న్యూ కల్చర్’’ని పెంపొందించడంపై పెడుతుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా విద్యామంత్రిత్వ శాఖ డేటాని ఉటంకిస్తూ..2023లో దేశంలో ‘‘కిండర్ గార్టెన్ల’’ సంఖ్య 14,808కి తగ్గిందని, మొత్తంగా దేశంలో 2,74,400కి తగ్గిందని వెల్లడించింది. వరసగా రెండో ఏడాది కూడామ జననాల రేటు తగ్గిపోవడాన్ని కథనం హైలెట్ చేసింది.
2023లో చైనా జనాభా రెండు మిలియన్లు తగ్గింది. 1949 తర్వాత తొలిసారిగా అత్యల్పంగా 2023లో 9 మిలియన్ల జనాభా నమోదైంది. చైనా ఇప్పుడు రెండు రకాల జనాభా సవాళ్లని ఎదుర్కొంటోంది. తగ్గుతున్న జనాభాతో పాటు, వృద్ధ జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి చైనాలో దాదాపుగా 30 కోట్ల మంది 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు గలవారే ఉన్నారు. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు మించుతుందని, 2050 నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2016 వరకు చైనా అవలంభించిన ‘‘వన్ చైల్డ్’’ విధానానికి జనాభా సంక్షోభం ఎక్కువ కారణమని చెప్పవచ్చు. 2021లో ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత సవరించి, కుటుంబానికి ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా అనుమతినిచ్చింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!