China: చైనాకు కొత్త కష్టం.. తగ్గుతున్న ‘‘కిండర్ గార్టెన్స్’’..
- చైనాను కలవరపెడుతున్న జనాభా సంక్షోభం..
- వరసగా రెండేళ్లుగా తగ్గిన జననాల రేటు..
- పెరుగుతున్న వృద్ధ జనాభా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి యువత వివాహాలు చేసుకోవడానికి, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. వరసగా రెండో ఏడాది కూడా ఆ దేశంలో శిశు జననాలు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశం పిల్లలు కనడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రసవం, శిశు సంరక్షణ సేవల్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు అక్కడి జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘చైల్డ్ బర్త్-ఫ్రెండ్లీ సొసైటీ’’ని సృష్టించడానికి కొత్త చర్యల్ని ప్రారంభించింది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గుతున్న సందర్భంలో ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
Read Also: Akkineni Nageswara Rao Last Message: ANR చివరి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ చర్యలు శిశుజననం మరియు శిశు సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, విద్య, గృహం మరియు ఉపాధిలో మద్దతును విస్తరించడం మరియు వివాహం మరియు పిల్లలను కనడం చుట్టూ ‘‘న్యూ కల్చర్’’ని పెంపొందించడంపై పెడుతుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా విద్యామంత్రిత్వ శాఖ డేటాని ఉటంకిస్తూ..2023లో దేశంలో ‘‘కిండర్ గార్టెన్ల’’ సంఖ్య 14,808కి తగ్గిందని, మొత్తంగా దేశంలో 2,74,400కి తగ్గిందని వెల్లడించింది. వరసగా రెండో ఏడాది కూడామ జననాల రేటు తగ్గిపోవడాన్ని కథనం హైలెట్ చేసింది.
2023లో చైనా జనాభా రెండు మిలియన్లు తగ్గింది. 1949 తర్వాత తొలిసారిగా అత్యల్పంగా 2023లో 9 మిలియన్ల జనాభా నమోదైంది. చైనా ఇప్పుడు రెండు రకాల జనాభా సవాళ్లని ఎదుర్కొంటోంది. తగ్గుతున్న జనాభాతో పాటు, వృద్ధ జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 చివరి నాటికి చైనాలో దాదాపుగా 30 కోట్ల మంది 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు గలవారే ఉన్నారు. 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు మించుతుందని, 2050 నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2016 వరకు చైనా అవలంభించిన ‘‘వన్ చైల్డ్’’ విధానానికి జనాభా సంక్షోభం ఎక్కువ కారణమని చెప్పవచ్చు. 2021లో ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత సవరించి, కుటుంబానికి ముగ్గురు పిల్లలను కలిగి ఉండేలా అనుమతినిచ్చింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!