Site icon NTV Telugu

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన డైలాగ్‌ డిక్లరేషన్‌కు చైనా గైర్హాజరు

షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్‌ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్‌ డైలాగ్‌ డిక్లరేష న్‌నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్‌ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్‌ చైనాను వివరణ కోరింది.

పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రోయికా ప్లస్ సమావే శానికి నాలుగు దేశాల నుండి ప్రత్యేక ప్రతినిధులు హాజరవు తారని డాన్ వార్తాపత్రిక తెలిపింది. ఇస్లామాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి చైనా హాజరవుతుందా అనే ప్రశ్నకు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడుతూ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం లో పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇస్తుంది అన్నారు. పాకిస్తాన్ నిర్వహించే సమావేశానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని చైనా ప్రత్యేక రాయబారి యు జియావో యోంగ్ హాజరవుతారని ఆయన అన్నారు.

Exit mobile version