Boxing Day tsunami: 23,000 అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో, అదే 2004 సునామీ..
- బాక్సింగ్ డే సునామీకి 21 ఏళ్లు..
- 23,000 అణుబాంబుల శక్తితో సునామీ..
- 14 దేశాల్లో 2 లక్షలకు పైగా మరణాలు..
Boxing Day tsunami: సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఇండోనేషియా సముద్రంలో సంభవించిన భూకంపం యావత్ ప్రపంచాన్ని భయపెట్టింది. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. అప్పటి వరకు ‘‘సునామీ’’ అంటే ఏమిటో తెలియని ప్రజలకు, అది ఎంత ఘోరంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది. ఇండోనేషియా సుమత్రా ద్వీపంలోని హిందూ మహాసముద్రగర్భంలో భారీ భూకంపం, రాకాసి అలల రూపంలో ఎగిసిపడింది. ఇండోనేషియా, భారత్, శ్రీలంకలతో సహా 14 దేశాల్లో 2,27,000 మంది ప్రాణాలను బలిగొంది.
సునామీకి కారణాలు ఏంటి.?
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
‘‘బాక్సింగ్ డే’’ సునామీగా పిలిచే ఈ ఘోరకలికి భూమి లోపల పొరల్లో ఉన్న ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ కదలిక కారణం. దశాబ్ధాలుగా టెక్టానిక్ ప్లేట్ల ఫాల్ట్ లైన్ల వెంట పేరుకుపోయిన ఒత్తిడి ఒక్కసారిగా భారీ విధ్వంసం రూపంలో బయటకు వచ్చింది. 2004, డిసెంబర్ 26న స్థానిక సమయం ప్రకారం ఉదయం 7.59 గంటలకు 9.1-9.3 మాగ్నిట్యూడ్తో శక్తివంతమైన భూకంపం వచ్చింది. ఇది సుందా మెగాథ్రస్ట్ ఫాల్ట్లో 1300 కి.మీ విస్తీర్ణంలో భూభాగం చీలింది. ఇంత పెద్ద విస్తీర్ణంలో భూభాగం రప్చర్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ శక్తి భూకంపం రూపంలో బయటకు వచ్చింది. ఈ ప్రదేశంలోనే ఇండియన్ ప్లేట్, బర్మా ప్లేట్ కింద సబ్డక్ట్ అవుతుంది.
సముద్ర అడుగుభాగం ఒక్కసారిగా అనేక మీటర్లు పైకి లేచి, 30 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని స్థానభ్రంశం చేసింది, 30 మీటర్లు (100 అడుగుల) ఎత్తు వరకు అలల్ని సృష్టించింది. ఇవి గంటకు 800 కి.మీ వేగంతో సముద్రంలో అన్ని వైపులా ప్రయాణించాయి. ఈ శక్తి ఏకంగా 23,000 హిరోషిమా అణు బాంబులతో సమానం.
లక్షల్లో మరణాలు:
భూకంప కేంద్రం సుమత్రాలోని ఆషే ప్రావిన్స్కు పశ్చిమాన 150 కి.మీ. దూరంలో, సముద్రగర్భం నుండి 30 కి.మీ. దిగువన ఉంది. నిమిషాల్లోనే భారీ అలలు అషేని ఢీకొట్టాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే 1,67,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. గంటల వ్యవధిలో అలలు శ్రీలంక, భారత్ తీరాలను చేశాయి. శ్రీలంకలో 35,000 మంది, భారత్లో 10,749 మంది, థాయిలాండ్లో 8000 మంది మరణించారు.
ఇండోనేషియా బండా అషేలో 51 మీటర్ల అల నగరాన్ని తుడిచిపెట్టింది. ఆ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే సునామీ అలర్ట్ వ్యవస్థ ఉంది. హిందూ మహాసముద్రంలో ఆనాడు ఈ వ్యవస్థ లేదు. ఈ ప్రకృతి విపత్తు తర్వాత, సునామీ వ్యవస్థలు హిందూ మహాసముద్రంలో కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!