Hafiz Saeed: ‘‘హఫీజ్ సయీద్ని భారత్కి అప్పగిస్తాం’’.. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఉగ్రవాది ఆగ్రహం..
- హఫీజ్ సయీద్, మసూద్ అజార్లను అప్పగించేందుకు పాక్ సిద్ధం..
- బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఉగ్రవాది తల్హా సయీద్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.
శుక్రవారం అల్ జజీరాకు ఇచ్చని ఇంటర్వ్యూలో భుట్టో మాట్లాడుతూ.. న్యూఢిల్లీ నుంచి సహకారం ఉంటే పాకిస్తాన్ కొందరు ఆందోళన కలిగించే వ్యక్తులను పాకిస్తాన్కు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
Read Also: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..
26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్, ప్రస్తుతం ఉగ్రవాద నిధులు సమకూర్చినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతడి కోసం పాక్ ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోంది. మరో ఉగ్రవాది మసూద్ అజార్ని ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టుగా గుర్తించింది. భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన మసూద్ అజార్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన దాడులతో సంబంధం కలిగి ఉన్నాడు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 కాందహార్ హైజాక్ బందీల మార్పిడిలో భాగంగా ఇతడిని భారత్ అప్పగించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం హఫీజ్ సయీద్ జైలులో ఉన్నారని, మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో తెలియని, బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చని బిలావల్ భుట్టో అన్నారు. పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ చెబుతున్న సమాచారాన్ని ఆయన తోపిపుచ్చారు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్హ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!