Bangladesh: అధికారం కోసం యూనస్ ప్లాన్.. ఢాకాలో మద్దతుగా ప్రదర్శనలు..
- ఎన్నికలు లేకుండా అధికారంలో ఉండేందుకు యూనస్ ప్లాన్..
- యూనస్కి మద్దతుగా ఢాకాలో భారీ ప్రదర్శనలు..
- రోహింగ్యా కారిడార్పై యూనస్ వర్సెస్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ‘‘రఖైన్ కారిడార్’’ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతం నుంచి మయన్మార్ రఖైన్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత ఈ కారిడార్ని ‘‘రక్తపాత కారిడార్’’ అంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ మాత్రం తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు లేకుండా మరో 5 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సైన్యం ఎన్నికల కోసం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై యూనస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. సైన్యం ఒత్తిడి మధ్య ఆయన రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ‘‘ముందు సంస్కరణలు, ఆ తర్వాతే ఎన్నికలు’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో యూనస్కి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి. యూనస్ని 5 ఏళ్లు అధికారంలో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఢాకా వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు.
Also Read
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
Read Also: Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్పై కేసు..
గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, యూనస్ బంగ్లా అధినేతగా మారారు. అయితే, అప్పటి నుంచి ఆయన విధానాల పట్ల ఆర్మీ తీవ్ర అసంతృప్తితో ఉంది. పలు సందర్భాల్లో యూనస్కి ఆర్మీ చీఫ్ వకార్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. యూనస్ ఆర్మీ వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు పాకిస్తాన్తో మిత్రుత్వం, భారత్తో శత్రుత్వాన్ని కొనసాగించడం ఆర్మీకి నచ్చడం లేదు. అయితే, యూనస్కి అమెరికా అండ ఉందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల్ని దాటవేస్తూ, రోహింగ్యా కారిడార్కి యూనస్ మద్దతు తెలుపుతున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కారిడార్ని యూఎన్ ద్వారా అమెరికా ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్లో ఏర్పడి రాజకీయ గందరగోళం మధ్య ఈ రోజు ఢాకాలో ‘‘మార్చ్ ఫర్ యూనస్’’ పేరిట భారీ ర్యాలీ చేశారు. గతేడాది, విద్యార్థి ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థి నేత నహిద్ ఇస్లాంతో యూనస్ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజావార్తలు
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!