Ayatollah Arafi: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయన తాత్కాలిక సుప్రీం లీడర్గా పనిచేస్తారని తెలిపింది. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియలో వారసుడిని ఎన్నుకునే వరకు, సుప్రీం లీడర్గా విధులు బాధ్యత కలిగిన తాత్కాలిక నాయకత్వ మండలిలో అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా నియమించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..
ఇరాన్ రాజ్యాంగ యంత్రాంగం ప్రకారం, తాత్కాలిక మండలిలో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం-హోస్సేన్ మొహ్సేని-ఎజీ, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక మతాధికారి ఉన్నారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ పరివర్తన దశలోకి అడుగుపెడుతున్నందున ఈ సంస్థ సంయుక్తంగా దేశాన్ని నడిపిస్తుంది.
1989 నుంచి ఉక్కు పిడికిలిలో దేశాన్ని పాలిస్తున్న 86 ఏళ్ల ఖమేనీని ఇజ్రాయిల్-అమెరికాలు హతమార్చాయి. శనివారం ఉదయం జరిగిన దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీతో పాటు 40 మంది టాప్ జనరల్స్ మరణించినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. మరణించిన వారిలో రక్షణ మంత్రి అమీర్ నాసర్జాదే, కమాండర్ ఇన్ చీఫ్ మహ్మద్ పక్పూర్ ఉన్నారు.
