Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..
- బంగ్లాదేశ్ ఎయిర్ బేస్పై స్థానికుల దాడి..
- కాల్పుల్లో ఒక స్థానికుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం.
Read Also: Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..?
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం.. ‘‘కాక్స్ బజార్ వైమానిక స్థావరానికి అనుకుని ఉన్న సమతి పారా నుంచి కొంతమంది నేరస్తులు కాక్స్ బజార్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వైమానిక దళం అవసరమైన చర్యలు తీసుకుంటోంది’’ అని చెప్పింది.
సమాచారం ప్రకారం.. అంతకుముందు రోజు భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది వైమానిక సిబ్బందికి, స్థానిక నివాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రెండు వైపుల గాయాలయ్యాయి. అయితే, అధికారులు మాత్రం ఎంత మంది అన్నది పేర్కొనలేదు. ఈ ఘర్షణలో బాధితుడికి తుపాకీ గాయాలయ్యాయి, కాక్స్ బజార్ జిల్లాలోని సదర్ ఆస్పత్రికి మృతుడిని తీసుకువచ్చారని వైద్య వర్గాలు తెలిపాయి. ఘర్షణకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ సలావుద్దీన్ తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!