Bangladesh: బంగ్లాదేశ్లో ఆగని హత్యలు.. మరో హిందువు ప్రాణాలు తీశారు..
- బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దారుణాలు..
- మరో హిందువును హత్య చేసిన దుండగులు..
- వ్యాపారవేత్తను కత్తితో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నర్సింగ్డి జిల్లా పలాష్ ఉప జిల్లా పరిధిలోని చార్సింధుర్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. అక్కడ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల మోని చక్రవర్తి.. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మోని చక్రవర్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Read Also: Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
Also Read
స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని పలాష్ ఉపజిల్లా ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పలాష్ పోలీస్ స్టేషన్ ఓసీ షాహిద్ అల్ మామున్ ఈ హత్యను ధృవీకరించారు. మృతుడు శిబ్పూర్ ఉపజిల్లాలోని సాధుచార్ యూనియన్కు చెందినవాడిగా గుర్తించారు. మోని చక్రవర్తి గత కొన్ని సంవత్సరాలుగా అదే మార్కెట్లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హత్య జరిగిన ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇదే రోజున జెస్సోర్ జిల్లాలో హిందూ వ్యాపారవేత్త, పత్రికా సంపాదకుడు రాణా ప్రతాప్ బైరాగి కాల్చి చంపబడిన ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ హత్య చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్ను మైమెన్సింగ్ జిల్లాలో కొట్టి చంపగా, డిసెంబర్ 25న అమృత్ మండల్ హత్యకు గురయ్యాడు. జనవరి 11న చిట్టగాంగ్లో ఆటో డ్రైవర్ సమీర్ దాస్ను దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. గత 25 రోజుల్లోనే పలువురు హిందూ యువకులు, వ్యాపారవేత్తలు హత్యకు గురవడం పట్ల మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హిందూ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులు వారి భద్రతపై పెద్ద ప్రశ్నగా మారాయి.
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!