Bangladesh: బంగ్లాదేశ్లో ఆగని హత్యలు.. మరో హిందువు ప్రాణాలు తీశారు..
- బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దారుణాలు..
- మరో హిందువును హత్య చేసిన దుండగులు..
- వ్యాపారవేత్తను కత్తితో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నర్సింగ్డి జిల్లా పలాష్ ఉప జిల్లా పరిధిలోని చార్సింధుర్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. అక్కడ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల మోని చక్రవర్తి.. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మోని చక్రవర్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Read Also: Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
Also Read
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని పలాష్ ఉపజిల్లా ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పలాష్ పోలీస్ స్టేషన్ ఓసీ షాహిద్ అల్ మామున్ ఈ హత్యను ధృవీకరించారు. మృతుడు శిబ్పూర్ ఉపజిల్లాలోని సాధుచార్ యూనియన్కు చెందినవాడిగా గుర్తించారు. మోని చక్రవర్తి గత కొన్ని సంవత్సరాలుగా అదే మార్కెట్లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హత్య జరిగిన ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇదే రోజున జెస్సోర్ జిల్లాలో హిందూ వ్యాపారవేత్త, పత్రికా సంపాదకుడు రాణా ప్రతాప్ బైరాగి కాల్చి చంపబడిన ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ హత్య చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్ను మైమెన్సింగ్ జిల్లాలో కొట్టి చంపగా, డిసెంబర్ 25న అమృత్ మండల్ హత్యకు గురయ్యాడు. జనవరి 11న చిట్టగాంగ్లో ఆటో డ్రైవర్ సమీర్ దాస్ను దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. గత 25 రోజుల్లోనే పలువురు హిందూ యువకులు, వ్యాపారవేత్తలు హత్యకు గురవడం పట్ల మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హిందూ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులు వారి భద్రతపై పెద్ద ప్రశ్నగా మారాయి.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!