Masood Azhar: పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ షాక్.. అటువంటి ఉగ్రవాదులు మీ దేశంలో ఉంటారని జవాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan comments on Masood Azhar and pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. జైషే చీఫ్ మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్ హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని.. అతన్ని పాకిస్తాన్ కు అప్పగించాలని కోరుతూ.. పాకిస్తాన్ విదేశాంగా శాఖ ఆఫ్ఘనిస్తాన్కు లేఖ రాసింది. అతన్ని పట్టుకుని పాకిస్తాన్ దేశానికి అప్పగించాలని కోరింది. అయితే ఈ పాకిస్తాన్ వాదనలను తప్పి కొట్టింది తాలిబాన్ ప్రభుత్వం. ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాకిస్తాన్ మాత్రమే పురిటిగడ్డ అని.. అక్కడి అధికారిక ప్రోత్సాహంతోనే ఉగ్రవాద సంస్థలు పనిచేస్తాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్ర పదజాాతంలో పాకిస్తాన్ పై విరుచుకుపడ్దారు.
ఆఫ్ఘనిస్తాన్ టోలో న్యూస్ ఇంటర్వ్యూలో ముజాహిద్ మాట్లాడుతూ.. మీడియాలో వచ్చిన వార్తలను చూశానని.. పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లు ఇది నిజం కాదని ఆయన అన్నారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేరని ఆయన అన్నారు. ఆఫ్ఘానిస్తాన్ గడ్డను మరే ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకునేందుకు అనుమతించమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో మాత్రమే ఉంటారని ఆయన అన్నారు.
Also Read
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
Read Also: Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
మసూద్ అజార్ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 1999లో కాఠ్మాండు, న్యూడిల్లీ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసినప్పుడు.. భారత్ ఇతన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా పలు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ నగరానికి తీసుకెళ్లారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పటి వాజ్పేయి ప్రభుత్వం మసూద్ అజార్ తో పాటు మరి కొందర్ని విడుదల చేసింది.
2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడికి మసూద్ అజారే కీలక సూత్రధారి. ఆ తరువాత పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేధించింది. 2019 మేలో ఐక్యరాజ్యసమితి మసూద్ అజార్ ను ‘ గ్లోబల్ టెర్రరిస్టు’గా ప్రకటించింది. మసూద్ అజార్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతున్నాడు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!