ఇండోనేషియాలో భారీ విస్పోటనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలకు నెలవైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్దరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలైంది. అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శనివారం ఉదయం నుంచే జావా ద్వీపంలో 3 వేల 6 వందల మీటర్ల ఎత్తైన ఈ అగ్ని పర్వతం నుంచి పెద్దఎత్తున బూడిద, వేడి రావడం ప్రారంభమైంది.
40 వేల అడుగుల ఎత్తువరకూ దట్టమైన పొగ, దమ్ము ధూళి అలముకుని వాతావరణం భయాందోళనలు కలిగించింది. తూర్పు జావా ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. అగ్నిపర్వతం విస్పోటనం అనంతరం అక్కడున్న బ్రిడ్జి దెబ్బతినడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొంతమంది చిక్కుకున్నారు. సెమెరు విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండోనేషియాలో ఏకంగా 130కి పైగా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలుస్తారు.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!