Paris: పీఎస్జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి
- పారిస్లో చెలరేగిన హింస
- పీఎస్జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ
- ఇద్దరు మృతి.. వందల మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్లో చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.. ఇక భారీగా కార్లు, బైకులు తగలబడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఆదివారం పారిస్లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పారిస్ సెయింట్ జర్మైన్ (PSG) క్లబ్ విజయం సాధించింది. ఇంటర్ మిలన్పై పీఎస్జీ క్లబ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ను పెద్ద స్క్రీన్లపై ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల దాదాపు 50 వేల మంది ప్రజలు గుమిగూడి మ్యాచ్ను వీక్షించారు. ఇక పీఎస్జీ క్లబ్ విజయం సాధించగానే అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బాణసంచా పేలిస్తూ నానా హంగామా సృష్టించారు. బాణసంచాను విసిరడంతో ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. అభిమానులు-పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలు, వాటర్ కేన్లు ప్రయోగించారు. దీంతో అభిమానులు మరింత రెచ్చిపోయి.. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులతో సహా వందల మంది ప్రజలు గాయాలు పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Siddipet: BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య..
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. పారిస్లో జరిగిన హింసలో ఇద్దరు మృతిచెందగా.. 21 మంది పోలీస్ అధికారుల సహా 200 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఫుట్బాల్ అభిమానులు బాణసంచా కాల్చారని.. అంతేకాకుండా బస్ షెల్టర్లు, కార్లు ధ్వంసం చేశారని తెలిపారు. అనంతరం రాజధానిలో 491 మందిని అరెస్ట్ చేయగా.. ఫ్రాన్స్ అంతటా 559 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాణసంచా, ఇతర వస్తువులు విసిరి అభిమానులు ఘర్షణ సృష్టించారని పేర్కొన్నారు.
ఇక ఆగ్నేయ ఫ్రాన్స్లోని గ్రెనోబుల్లో అభిమానులపైకి కారు దూసుకెళ్లిందని.. దీంతో నలుగురు గాయపడ్డారని.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. అయితే డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. మద్యం, డ్రగ్స్ మత్తులో ఇలా చేసినట్లుగా చెప్పారు. రాత్రి పూట 692 మంటలు సంభవించాయని. 264 కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.
🇫🇷 Aftermath of PSG’s Champions League title ‘celebrations’:
» Two people died — a 20-year-old female and a 17-year-old who was stabbed to death, according to the French Interior Ministry.
» 192 people were injured, and 692 fires were reported, including 264 involving vehicles.… pic.twitter.com/Fu0vnAW62r
— 𝐂𝐚𝐬𝐮𝐚𝐥 𝐔𝐥𝐭𝐫𝐚 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 (@thecasualultra) June 1, 2025
Breaking News: 2 people are dead, 192 injured, and 559 arrested in Paris as migrants riot and loot after PSG wins the UEFA Champions League. A police officer is in a coma. pic.twitter.com/qwRJ2EwqGp
— Imtiaz Mahmood (@ImtiazMadmood) June 1, 2025
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..