First Virtual School in India: దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్. ఢిల్లీ, కేంద్రం పోటాపోటీ ప్రకటనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Virtual School in India: దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్ని నిన్న బుధవారం ప్రారంభించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్మెంట్ తప్పు అంటూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ఖండించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం.. ఈ స్కూల్లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా స్టూడెంట్స్ అడ్మిషన్ పొందొచ్చు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే దీనికి శ్రీకారం చుట్టారు.
ఈ వర్చువల్ స్కూల్.. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫిలియేషన్తో నడుస్తుంది. వివిధ కారణాల రీత్యా స్కూల్కి వెళ్లలేనివాళ్లు ఇందులో ప్రవేశాలు పొందొచ్చు. అడ్మిషన్లు కూడా నిన్నే ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సైతం ఇక్కడ స్పెషల్ కోచింగ్ ఇవ్వనుండటం విశేషం. ఈ వర్చువల్ స్కూల్లో ప్రస్తుతానికి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇస్తున్నారు. ఈ స్టూడెంట్స్.. లైవ్ క్లాస్లకు అటెండ్ కావొచ్చు. రికార్డు చేసిన క్లాస్ల వీడియోలు చూసి పాఠాలు నేర్చుకోవచ్చు. స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు.
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
ఈ మేరకు ప్రతిఒక్కరికీ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. డిజిటల్ లైబ్రరీ సేవలనూ వాడుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్నీ అందిస్తారు. మొత్తమ్మీద ఈ వర్చువల్ స్కూల్ దేశ విద్యా రంగాన్ని మలుపుతిప్పే చెప్పుకోదగ్గ పరిణామమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా దేశంలోనే ప్రప్రథమ వర్చు్వల్ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అందుబాటులోకి తెచ్చిందని ఎన్ఐఓఎస్ ప్రకటన చేయటం గమనార్హం. ఢిల్లీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన కూడా వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
”ఎన్ఐఓఎస్లో ప్రస్తుతం 7 వేల స్టడీ సెంటర్లు అకడమిక్ సపోర్ట్ అందిస్తున్నాయి. 15 వందల స్టడీ సెంటర్లు నైపుణ్య ఆధారిత వృత్తివిద్యా కోర్సులను బోధిస్తున్నాయి. లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులను సైతం నిర్వహిస్తున్నాయి. 2021లో ప్రారంభమైన ఫస్ట్ సెషన్లో వర్చువల్ స్కూల్ పరిధిలోని లెర్నర్స్ 2.18 లక్షల అసైన్మెంట్లను అప్లోడ్ చేశారు” అని ఎన్ఐఓఎస్ వివరించింది. ఎన్ఐఓఎస్ని గతంలో నేషనల్ ఓపెన్ స్కూల్(ఎన్ఓఎస్)గా వ్యవహరించేవారు. దీన్ని 1989 నవంబర్లో జాతీయ విద్యావిధానం-1986కి అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రారంభించారు.
ఈ సంస్థ సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిల్లో జనరల్, అకడమిక్ కోర్సులతోపాటు అనేక వృత్తి విద్య, లైఫ్ ఎన్రిచ్మెంట్, కమ్యూనిటీ బేస్డ్ కోర్సులను అందిస్తోంది. ఈ వర్చువల్ స్కూల్ వ్యవహారం కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. దీనిపై ఒక్క రోజులోనే రెండు భిన్న ప్రకటనలు వచ్చాయి. ఈ కథ భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!