Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: చనిపోతానంటూ బెదిరించి ఓ యువతి నుంచి విడతల వారీగా ఏకంగా రూ.1.38 కోట్లు వసూలు చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయవాడ సూర్యారావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, హైదరాబాద్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతికి మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు స్నాప్చాట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, అమలాపురం సమీపంలోని అంబాజీపేట తన స్వగ్రామమని అతను ఆమెకు చెప్పినట్లు సమాచారం. పరిచయం పెరగడంతో ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరూ కలిసి కోయంబత్తూరుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
కోయంబత్తూరులో ఉన్న సమయంలో గౌతంనాయుడు తాను ఆన్లైన్ క్రిప్టో కరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఆ మొత్తం బ్లాక్ అయిందని యువతికి చెప్పాడు. అత్యవసరంగా డబ్బులు అవసరమని కోరడంతో ఆమె లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రూ.10.42 లక్షలు అతనికి ఇచ్చింది. ఆ తర్వాత కూడా డబ్బులు కావాలని గౌతంనాయుడు కోరగా, తన వద్ద ఇక డబ్బులు లేవని యువతి స్పష్టం చేసింది. దీంతో డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ అతను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంటున్నట్లు ఫొటో తీసి వాట్సాప్లో పంపినట్లు తెలిపింది.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి ఈ విషయం తల్లికి కూడా చెప్పకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు గౌతంనాయుడికి ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అతను మరిన్ని డబ్బులు కావాలంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు వేధింపులు, బెదిరింపులు భరించలేక యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి నుంచి నగదు ఏ విధంగా తీసుకున్నాడు, మొత్తం లావాదేవీల వివరాలు, నిందితుడి ఆర్థిక కార్యకలాపాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?