Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.
Read Also: Himachal Pradesh : హిమాచల్ మండిలో మేఘతుఫానుకి కొట్టుకుపోయిన బస్సులు, మట్టితో ముంచేసిన ఇల్లులు.
మృతుడిని 19 ఏళ్ల రాకేష్గా గుర్తించారు. సంఘటన జరిగిన రోజు దేవీరామ్, రాకేష్ను దుకాణానికి తీసుకెళ్లాడు. దేవీరామ్ తన మరో మేనల్లుడు నిత్య కిషోర్తో కలిసి రాకేష్ గొంతు కోసి హత్య చేశారు. ఇద్దరు మృతదేహాన్ని నీలి రంగు డ్రమ్లో పెట్టి, ఒక వాహనంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘటన తర్వాత డీఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి, కేసును పరిష్కరించారు.
రాకేష్ తన మైనర్ కుమార్తె ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే , అతడిపై కోపం పెంచుకున్న తండ్రి దేవీరామ్ నేరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబూల్పూర్ గ్రామానికి చెందిన శంకర్ సింగ్ బాఘేల్ కుమారుడు దేవిరామ్ను అరెస్టు చేశారు, కిషోర్ పరారీలో ఉన్నాడు. నేరం తర్వాత బాధితుడి మొబైల్ ఫోన్ను ఖరీ నదిలో పడేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
