Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని మీర్జాపూర్లో జిమ్లలో హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని, వారిని లవ్ ఉచ్చులోకి లాగా, ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించిన మాఫియాపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. 10 మంది నిందితులపై ‘‘గ్యాంగ్ స్టర్ చట్టం’’ కింద కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, నేర నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది.
ఈ కేసులో ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఖాన్, మత గురువు ఖలీలు రెహమాన్ సహా ఇతర నిందితులు జిమ్లకు వెళ్లే హిందూ మహిళల్ని ప్రేమ వ్యవహారాల్లోకి దింపి, వారిని ఇస్లాంలోకి మార్చడానికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఒక పథకం ప్రకారం మహిళల్ని ప్రభావితం చేయడానికి యత్నించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని యూపీ పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం నెట్వర్క్పై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.
