UP News: ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కిడ్నాప్గా భావించిన కేసు చివరకు లవ్ ఎఫైర్ బయట పడింది. అలీగఢ్ సైబర్ క్రైమ్ సెల్లో పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఫిబ్రవరి 7న తన పెళ్లికి ముందు ఇంట్లో నుంచి అదృశ్యమైంది. అయితే, దీనిపై కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన హత్యా కేసు నిందితుడైన అంకిత్ చౌహాన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: India-UK: ఇది కదా భారత్ సత్తా.. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు IAF శిక్షణ..
విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఇది కిడ్నాప్ కాదని, కానిస్టేబుల్ తన ఇష్టపూర్వకంగానే అంకిత్తో కలిసి పారిపోయిందని అధికారులు చెప్పారు. వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని ధ్రువీకరించారు. స్థానికంగా ఉండే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిన, ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే శనివారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి మిస్సైంది. ఒక రోజు తర్వాత పోలీసులు ఆమెను గుర్తించి స్టేషన్ తీసుకువచ్చారు. అక్కడే ఆమె స్టేట్మెంట్ ఇచ్చి, తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లింది.
మరోవైపు, నిందితుడైన అంకిత్ చౌహాన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసేలోపే, మంగళవారం రోజు జిల్లా సెషన్స్ కోర్టులో లొంగిపోయాడు. పోలీసులు కోర్టు వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి సీన్ చేయకుండా అంకిత్ లొంగిపోయాడు.
