TCS Nashik Case: నిదా ఖాన్ ప్రెగ్నెంట్.. “టీసీఎస్ నాసిక్ కేసు”లో ముందస్తు బెయిల్ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆఫీసుల్లో ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ యువతులు, తమ కింద పనిచేసే ఇతర ఉద్యోగుల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, పెళ్లి పేరుతో మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, లైంగిక వేధింపులు, మతమార్పిడికి పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే, నిదా ఖాన్ తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తు నాసిక్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిదాఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఆమె కుటుంబీకులు తెలిపారు. పరారీలో ఉన్న సమయంలోనే నిదా ఖాన్ బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. తన బెయిల్ పిటిషన్లో వైద్య పరిస్థితిని కీలక అంశంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
Also Read
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
నిందితుల్లో ఒకరు, సహోద్యోగిని పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసి, పదేపదే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్యోగులలో ఒకరిని అసభ్యం తాకడం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది. టీమ్ లీడర్ పొజిషన్లలో ఉన్న నిందితులు తన కింది ఉద్యోగినికి మతపరమైన టోపీని ధరింపచేసి, నమాజ్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులను ఇప్పటికే టీసీఎస్ సస్పెండ్ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని టీసీఎస్ చెప్పింది
తాజావార్తలు
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
-
Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
-
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!