Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
- తల్లిని హతమార్చిన తనయుడు
- మేకను అమ్మే విషయంలో గొడవ
- మాతృమూర్తిని సజీవదహనం చేసిన కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ… వాళ్లకోసం ఏం చేయాలీ… ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది. కానీ.. అలాంటి తల్లులకు పిల్లలు ప్రస్తుతం మర్యాద ఇవ్వడం లేదు. రెక్కలొచ్చాక కని పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో హత్యాయత్నం సంచలనం సృష్టించింది. మేకను అమ్మే విషయమై గొడవపడి కొడుకు తన తల్లిని సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు బచ్రా గ్రామంలో చోటుచేసుకుంది. మేకలను అమ్మడంపై జరిగిన గొడవలో..తన 50 ఏళ్ల మాతృమూర్తిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
READ MORE: UP Video: యూపీలో వీధి కుక్కు స్వైర విహారం.. గంటలో 17 మందిపై ఎటాక్
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
శుక్రవారం రాత్రి తల్లి దేవి -కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ మధ్య మేకను అమ్మే విషయంపై గొడవ తలెత్తింది. తల్లి దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన కమలేష్ ఓ పరికరంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంతటితో ఆగకుండా కుమారుడు తన తల్లి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమె కుమారుడు కిషున్ బిహారీ యాదవ్ ఆమెను బట్టల కింద దాచి పెట్రోలు పోసి నిప్పంటించాడని అదనపు ఎస్పీ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి పరిగెత్తి మంటలను ఆర్పివేశారని, అయితే అప్పటికే మహిళ చనిపోయిందని చెప్పారు. హత్య కేసులో మహిళ కుమారుడు కిషున్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?