Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక శుభకార్యానికి హాజరై, ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుక అనంతరం, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలోని హల్దీ వాగు వద్దకు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సరదాగా వాగులో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
వాగులోకి దిగిన ఈ ముగ్గురు స్నేహితులకు నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే వయసు వారు (27 ఏళ్లు) కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబాల్లో విషాదం..
ఒకే ఊరికి చెందిన ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణ స్నేహితులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో నర్సాపూర్లో విషాదం నెలకొంది. పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన కొడుకులు శవాలై రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలాశయాలు, వాగుల వద్దకు వెళ్లేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా లోపలికి వెళ్లడం ప్రాణాంతకమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!