Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక శుభకార్యానికి హాజరై, ఆ సంతోషాన్ని పంచుకోవాల్సిన యువకులు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ప్రశాంత్ (27), వికాస్ (27), ఆనంద్ రెడ్డి (27) అనే ముగ్గురు స్నేహితులు బుధవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వివాహ వేడుక అనంతరం, గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలోని హల్దీ వాగు వద్దకు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సరదాగా వాగులో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
వాగులోకి దిగిన ఈ ముగ్గురు స్నేహితులకు నీటి లోతుపై అవగాహన లేకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు మరియు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే వయసు వారు (27 ఏళ్లు) కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబాల్లో విషాదం..
ఒకే ఊరికి చెందిన ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణ స్నేహితులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో నర్సాపూర్లో విషాదం నెలకొంది. పెళ్లికి వెళ్లి వస్తామని చెప్పిన కొడుకులు శవాలై రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జలాశయాలు, వాగుల వద్దకు వెళ్లేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా లోపలికి వెళ్లడం ప్రాణాంతకమని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Potato Uttapam Recipe: బ్రేక్ఫాస్ట్లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
-
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
-
CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
Jagadish Reddy: కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
-
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!