Ujjain Rape Case: “నా కొడుకును ఉరేసి చంపండి”.. ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన దేశాన్ని షాక్కి గురిచేసింది. ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రవేదనతో అర్దనగ్నంగా ప్రతీ ఇంటి ముందు వెళ్లి సాయం అడిగిన వీడియో యావత్ దేశాన్ని కుదిపేసింది. ఓ దిక్కు రక్తం కారుతున్నా, 8 కిలోమీటర్లు నడిచి సాయం కోరితే, కొందరు ఇంటి ముందు నుంచి తరిమికొట్టడం అక్కడ సీసీటీవీల్లో రికార్డైంది. చివరకు ఓ గుడి పూజారి బాలికను పరిస్థితిని గుర్తించి కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన వెంటనే ప్రధాన నిందితుడైన ఆటోడ్రైవర్ భరత్ సోనిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ‘‘నా కొడుకును ఉరేసి చంపండి’’ అని నిందితుడు భరత్ సోని తండ్రి డిమాండ్ చేశారు. బాధిత బాలిక కూడా తన కూతురు లాంటిదే అని ఆయన అన్నారు. ఈ కేసులో నిందితుడి పక్షాలన ఎవరూ వాదించవద్దని స్థానిక బార్ అసోసియేషన్ కోరింది.
Also Read
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
Read Also: Jaishankar: మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు.. ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్ మెసేజ్..
ఇది సిగ్గుమాలిన చర్యల, నేను నా కొడుకును కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లలేదు, పోలీస్ స్టేషన్, కోర్టుకు కూడా వెళ్లను, నా కొడుకు నేరం చేశాడు కాబట్టి అతన్ని ఉరితీయాలి అని నిందితుడి తండ్రి అన్నారు. ఈ ఘటన పవిత్ర ఉజ్జయిని ప్రాంత ప్రతిష్టను దెబ్బతీసిందని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడి భరత్ సోనితో పాటు మరో ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పట్టుకున్నారు. బాధిత బాలిక ప్రస్తుతం ఇండోర్ లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా మౌనంగా ఉన్నారని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మహిళలు కావడం పాపంగా మారిందని, మైనర్ల అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, 18 ఏళ్ల పాలనలో 58 వేల రేప్ కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
తాజావార్తలు
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!