Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Real Estate Bizman Held For Murdering Divorced Sister To Claim Rs 1 Cr Insurance Payout In Andhra 8662252

Shocking Murder: ఇన్సూరెన్స్ పైసల కోసం.. మరీ ఇంతకు తెగిస్తారా..

Published Date :October 15, 2025 , 7:38 pm
By Devarakonda Srikanth
  • చిత్తూరు జిల్లాలో దారుణం .
  • ఇన్సూరెన్స్ పైసల కోసం వ్యక్తిని హత్య
  • ముక్కలుగా కోసి చెరువులో పడేసిన నిందితులు
Shocking Murder: ఇన్సూరెన్స్ పైసల కోసం.. మరీ ఇంతకు తెగిస్తారా..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కేవలం ఇన్సూరెన్స్ పైసల కోసం వ్యక్తిని హత్యచేసారు. అనంతరం ముక్కలుగా కోసి చెరువులో పడేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మూడున్నర నెలల తరువాత మృతదేహం ముక్కలుగా దొరకడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also:Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే..

Also Read

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
  • HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Add as a preferred
source on google

ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత మృతదేహం గుర్తింపుతో సంచలన వ్యవహారం వెలుగు చూసింది. హైకోర్టు, హ్యూమన్‌ రైట్స్‌ చొరవతో కేసు కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మృతదేహం ముక్కలు లభించగా.. మృతదేహం కోసం చెరువులో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపంతో.. ఇన్సూరెన్స్‌ డబ్బులో వాటా ఇవ్వలేదని పుదుపేటకు చెందిన గుణశీలన్ (65) అనే వృద్ధుడిని.. అయ్యప్పన్‌, గంగాధరం కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు .

Read Also:Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…

నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేటకు చెందిన పీవీ గుణశీలన్‌ కు నలుగురు సంతానం.. చిన్న కొడుకు విజయ్‌ చెన్నైలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. పుదుపేటలోనే ఉంటున్న గంగాధరం కూతురు కౌసల్యతో విజయ్ కు పెళ్లి కాగా కుటుంబ తగాదాలతో ఆరు నెలలకే విజయ్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే అతడి పేరు మీద ఇన్సూరెన్స్‌ డబ్బు రూ.1.25 కోట్ల దాకా వచ్చింది. ఈ నగదు గుణశీలన్, కళావతి అకౌంట్ లోకి వెళ్లింది.

అయితే అల్లుడు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బులో తమ కూతురుకు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు. ఈ దశలో నగరిలో విడిగా ఉండలేక గుణశీలన్‌ ఆయన భార్య కళావతి తిరుత్తణిలో ఉన్న కూతురు సంగీత వద్దే ఉండిపోయారు. పద్మావతినగర్‌లో ఆమె నిర్మించే ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. పుదుపేటలో ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంటిని గుణశీలన్‌ తనకు పరిచయం ఉన్న అయ్యప్పన్‌కు అద్దెకు ఇచ్చాడు. గుణశీలన్‌ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్‌ వడ్డీకి కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేసి నెలనెలా ఇస్తానని రూ.28 లక్షలు దాకా అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల్లో రూ.3.60 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన డబ్బులకు సమాధానం చెప్పకుండా ఉండటంతో.. డబ్బులు తిరిగి చెల్లించాలని గుణశీలన్‌ గట్టిగా నిలదీశాడు.

Read Also:Andhra Pradesh: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు..

ప్రతిరోజు ఉదయం కూతురు ఇంటి నిర్మాణ పనులను చూసుకునేందుకు క్యారియర్ తో వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే గుణశీలన్‌ 2025 జూన్‌ 6వ తేదీ వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. నాలుగు రోజులపాటు రాకపోవడం, ఫోన్‌ పనిచేయకపోవడంతో కూతురు సంగీత తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయ్యప్పన్ ని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

Read Also:Jubilee Hills By Poll : భారీ స్థాయిలో నామినేషన్లు.. ఇప్పటి వరకు ఎన్నంటే..?

ఇన్సూరెన్స్ డబ్బుల్లో తన కూతురుకు వాటా ఇవ్వలేదని కసితో ఉన్న గంగాధరం కలిసి హత్యకు ప్లాన్ చేశారు. అప్పుల విషయం మాట్లాడుకుందామని అయ్యప్పన్ నగరిలోని ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం అయ్యప్పన్‌ గుణశీలన్‌ను తల వెనుకవైపు బలమైన కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల, మొండెం, కాళ్లు , చేతులు అన్ని నరికి గోనె సంచిలో కట్టి నదిలో పడేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chittoor murder
  • dismembered body
  • Insurance Fraud
  • life insurance payout

తాజావార్తలు

  • IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!

  • Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!

  • Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?

  • Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్

  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions