NTV Telugu Site icon

గోల్కొండలో 2కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నకిలీ కరెన్సీ ముఠా తిరుగుతోందన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నకిలీ కరెన్సీని ఎవరెవరికి, ఎక్కడ సప్లయ్ చేశారనేది విచారణలో బయటపడుతుందంటున్నారు పోలీసులు.