Operation Gone Wrong: డాక్టర్ నిర్వాకం.. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో వచ్చిన వ్యక్తికి ఆపరేషన్ చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Gone Wrong In Kurnool Patient Died: కొందరు డాక్టర్లు ఏం లేకపోయినప్పటికీ.. పేషెంట్లకు ఏవేవో జబ్బులు ఉన్నాయని చెప్పి, డబ్బులు గుంజుతుంటారు. సమస్య చిన్నదే అయినా.. దాన్ని పెద్దదిగా చూపించి, ఆపరేషన్ చేయాలని చెప్పి, లక్షలకు లక్షలు దోచుకుంటుంటారు. ఓ డాక్టర్ కూడా అలాగే ఒక వ్యక్తి నుంచి డబ్బులు దోచుకోవాలని చూశాడు. కానీ, అతని ప్లాన్ బెడిసికొట్టింది. ఆపరేషన్ వికటించి, బాధితుడు చనిపోవడంతో.. సదరు డాక్టర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్కు చెందిన సుమంత్(28), కొంతకాలం నుంచి కడుపుబ్బరం సమస్యతో బాధపడుతున్నాడు. ఈమధ్య సమస్య తీవ్రం కావడంతో.. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించాడు. ఆ ఆర్ఎంపీ కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్ను రిఫర్ చేశాడు.
ఆ ఆర్ఎంపీ సూచన మేరకు.. సుమంత్ వెంటనే మెడికేర్ ఆసుపత్రికి వెళ్లి, తన సమస్య చెప్పుకున్నాడు. అతడ్ని పరీక్షించిన వైద్యుడు.. స్కానింగ్ తీయించాలని సూచించాడు. స్కానింగ్ రిపోర్ట్ పరిశీలించిన అనంతరం.. నీకు అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయని హెచ్చరించాడు. దాంతో సుమంత్ సదరు ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ఆసుపత్రిలో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ ముగిశాక, ఇక ఎలాంటి సమస్య లేదని ఆ వైద్యుడు చెప్పాడు. అయితే.. అదే రోజు రాత్రి అతనికి తీవ్రమైన కడుపునొప్పి, ఆయాసం వచ్చాయి. అప్పుడు వెంటనే వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లారు. అయినప్పటికీ ఆ సమస్య తగ్గకపోవడంతో, మరింత పెరిగింది. దీంతో అతడు గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడంటూ సుమంత్ భార్య ఆరోపించింది. కుటుంబ సభ్యులు సుమంత్ మృతదేహాన్ని ఆస్పత్రి ముందు ఉంచి, ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాల సమస్యని పరిష్కరించి, రాజీ కుదిర్చారు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఈ విషయంలో వెలుగుచూసిన షాకింగ్ విషయం ఏమిటంటే.. సుమంత్కు చికిత్స అందించిన ఆ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. తాత్కాలిక అనుమతులు కూడా లేవని తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. ఈ ఘటనపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య చెప్పారు. చూస్తుంటే.. డబ్బులకు ఆశ పడి, ఏం లేకపోయినా డబ్బుల కోసం సుమంత్కి అపెండిక్స్ ఉందని అబద్ధం చెప్పి, ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!